నగర ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు: విజ‌య‌వాడ‌ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజ‌య‌వాడ‌: కులమతాలకు అతీతంగా మానవాళి అభ్యున్నతికి ఆచరణియమైన భోదనలు అందించిన గొప్ప మానవతావాది ఏసుక్రీస్తు అని, మంచి చెడుల వ్యత్యాసాన్ని గుర్తించి మంచి తనంతో, విశ్వాసంతో సమాజంలో పొరుగువారి పట్ల సోదర భావంతో మెలగుతూ సుఖసంతోషాలతో జీవించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

నగర ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు: కమిషనర్ ప్రసన్న వెంకటేష్
 మన మద్యనే నడయాడి శాంతి సందేశాన్ని అందించిన ఏసుక్రీస్తు మార్గం అనుసరణియమని ప్రతి ఒక్కరు మంచి పెంపొందించుకొనవలెనని, శాంతి కాముకులుగా సమాజాభివృద్ధికి పాటు పడాలని, అందరూ కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో ఆయురారోగ్యములతో చల్లగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షిస్తూ, అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

More Press News