ఆసక్తి రేకెత్తించేలా ‘అథర్వ’ స్నీక్ పీక్.. సింగిల్ షాట్‌లో తీసిన మూడు నిమిషాల సన్నివేశం

Related image

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా తెరకెక్కించిన చిత్రం  'అథర్వ'. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా  హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో సినిమా మీద మరింత ఆసక్తి కలిగించేలా స్నీక్ పీక్ అంటూ సింగిల్ షాట్‌‌లో తీసిన సీన్‌ను రిలీజ్ చేశారు.

ఈ స్నీక్ పీక్‌లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురి వ్యక్తుల హత్య జరుగుతుంది. క్లూస్ టీం వచ్చి క్లూస్ కలెక్ట్ చేసే పనిలో ఉంటుంది. ఈ క్లూస్ టీంలోనే హీరో హీరోయిన్లు ఉన్నారు. క్లూస్ ఎలా కలెక్ట్ చేస్తారో డీటైలింగ్‌గా చూపించారు. క్లూస్ కలెక్ట్ చేసే పనిలో టీం ఉంటే.. పోలీస్ వచ్చి తన డ్యూటీ తాను చేసుకుంటాడు. ఈ హత్యల గురించి సమాచారాన్ని మీడియాకు ఇస్తాడు. 

మూడు నిమిషాల పాటు ఉన్న ఈ సీన్‌ను సింగిల్ షాట్‌లో తీయడం విశేషం. ఇక ఆ హత్యలు చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసింది ఎవరు? వీటి వెనకాల ఉన్నది ఎవరో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా చూడాలంటే డిసెంబర్ 1 వరకు ఆగాల్సిందే.

More Press Releases