ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు సాధికారతనిస్తోన్న బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు సాధికారతనిస్తోన్న బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్

భారతదేశంలో సుప్రసిద్ధ అగ్రోకెమికల్స్ కంపెనీ అయిన బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ ఇటీవల మిర్చి నర్సరీలపై రైతు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. చీరాల మండలం మార్టూరులో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక వ్యవసాయ సమాజం నుండి చక్కటి ఆదరణ లభించింది. 


300 మందికి పైగా ఔత్సాహిక రైతులు హాజరైన ఈ కార్యక్రమం మిరప సాగులో అత్యాధునిక సాంకేతికతలు మరియు ఆవిష్కరణలతో వారికి అవగాహన కల్పించడం మరియు సాధికారత కల్పించడం కోసం రూపొందించబడింది.


"మెరుగైన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే  బెస్ట్ ఆగ్రోలైఫ్ యొక్క నిబద్దతకి అనుగుణంగా ఈ సమావేశం జరిగింది. రైతులు,  తమ  పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా చేసే పద్ధతులకు మేము కట్టుబడి ఉన్నాము. దిగుబడిని పెంచడం, సుస్థిరతను ప్రోత్సహించడం మరియు శ్రేయస్సును పెంపొందించడంలో మా స్థిరమైన అంకితభావం,  ఆధునిక సాంకేతికతలను స్వీకరించటం మరియు అత్యాధునిక ఉత్పత్తులు విడుదల చేయటం  ద్వారా ఉదహరించబడుతుంది. " అని బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  సురదేవర బాల వెంకట రామ ప్రసాద్ అన్నారు.


ఈ కార్యక్రమంలో, బెస్ట్ ఆగ్రోలైఫ్ నుండి నిపుణుల బృందం మిరప సాగుపై సమగ్ర సాంకేతిక ప్రదర్శనను చేసింది, నర్సరీ నిర్వహణ నుండి పంటకోత పద్ధతుల వరకు వివిధ అంశాలను కవర్ చేసింది. ప్రదర్శించిన ఉత్పత్తుల పట్ల రైతులు ఆసక్తి మరియు ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్యాంశాలలో ఒకటి చిల్లీ నర్సరీ ట్రేల యొక్క ప్రత్యక్ష ప్రదర్శన, ఇక్కడ శుద్ధి చేయబడిన మరియు శుద్ధి  చేయని నమూనాలను ప్రదర్శించారు. ఈ సమావేశాన్ని బెస్ట్ ఆగ్రోలైఫ్ మార్కెటింగ్ మేనేజర్ మంధేష్ నిర్వహించారు.
Andhra Pradesh
Best Agrolife Ltd

More Press News