తెలంగాణ ఆర్.అండ్.బి ఇంజనీర్స్ అసోసియేషన్ డైరి ఆవిష్కరించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Related image

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి నివాసంలో ఈ రోజు తెలంగాణ ఆర్.అండ్.బి శాఖ ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన సంవత్సరం 2020 డైరిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో ఇంజనీర్ ఇన్ చీఫ్ రవీందర్ రావు, చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్, అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరం డైరి ఆర్.అండ్.బి శాఖ సిబ్బంది సౌకర్యార్థం తీసుకురావడం జరుగుతుందని ఇందులో డిపార్ట్మెంట్ కి చెందిన అధికారుల పూర్తి సమాచారం, మొబైల్ నెంబర్స్ పొందుపరచబడినవి అని సిబ్బంది మంత్రికి వివరించారు. ప్రభుత్వ డైరి లాగనే ఈ డైరి డిజైన్ చేయడం బాగుంది అని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు.

More Press Releases