ఈ నెల 25న జనసేన పీఏసీ సమావేశం: నాదెండ్ల మనోహర్

Related image

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఈ నెల 25న (సోమవారం ) ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షత వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు, తెలుగు భాష పరిరక్షణ కోసం పార్టీ త్వరలో చేపట్టబోయే "మన నుడి - మన నది", డొక్కా సీతమ్మ పేరిట నిర్వహించిన ఆహార శిబిరాలు, ఇసుక లభ్యత-భవన నిర్మాణ కార్మికుల స్థితిగతులు, రాయలసీమలోని పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులు, క్యాడర్ సమావేశాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

More Press Releases