పారిశుధ్య, డ్రెయిన్ల నిర్వహణను మెరుగుపర్చాలి: వీఎంసీ కమిషనర్

Related image

  • కృష్ణలంక రాణిగారి తోట, సిమెంట్ గోడౌన్ ప్రాంతాలలో పర్యటన
  • అధికారులకు పలు సూచనలు
విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణతో కలసి డివిజన్ పరిధిలోని కృష్ణలంక, రాణి గారి తోట, సిమెంట్ గోడౌన్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదల విధానము క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. పర్యటనలో స్థానిక కార్పొరేటర్ డివిజన్ పరిధిలోని పలు సమస్యలతో పాటుగా 20వ డివిజన్ నకు సంబందించి 100, 101 వార్డ్ సచివాలయాలను మార్చుట, ఉర్దూ స్కూల్ నిర్మాణం కొరకు స్థలం ఏర్పాటు, సచివాలయం, స్వయం సహాయక సంఘాల వారు సమావేశాలు నిర్వహించుటకు వీలుగా రూమ్ ఏర్పటు మరియు 108 వారికీ ఆఫీస్ రూమ్ కేటాయించుట మరియు తాడికొండ సుబ్బారావు ఎలిమెంటరీ స్కూల్ దారి ఏర్పాటు చేయు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చిన సందర్బంలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు సూచించారు.

అదే విధంగా డివిజన్ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పైపు లైన్ పనులను వేగవంతము చేయుటతో పాటుగా డివిజన్ పరిధిలో సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులను కూడా సత్వరమే చేపట్టునట్లుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలో గల పార్క్ నిర్వహణ మరియు పార్క్ నందు చిన్నారులకు అందుబాటులో గల ఆట పరికరాలు మొదలగు అంశాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు.

పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

16వ డివిజన్ పరిధిలో పలు సమస్యల పరిశీలన తదితర ప్రాంతాల పరిశీలన: 
 
16వ డివిజన్ పరిధిలోని గీతానగర్, దూరదర్శన్ కాలనీ, పోలీస్ కాలనీ తదితర ప్రాంతాలలో నగరపాలక సంస్థ క‌మిష‌న‌ర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పర్యటించి స్థానంగా ఉన్న పలు సమస్యలను పరిశీలించారు. గీతానగర్ నందు అందుబాటులో ఉన్న రెవిన్యూ స్థలము నందు నగరపాలక సంస్థ పాఠశాల స్కూల్ భవనం నిర్మాణము చేపట్టుటకై కలెక్టర్ వారి నుండి అనుమతి పొందుటకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. గీతానగర్ నది వెంబడి క్రాబ్ వాల్ మరియు అప్రోచ్ రోడ్ ఏర్పాటుకు అవసరమగు అంచనాలు రూపొందించి సమర్పించాలని అన్నారు. అదే విధంగా 15వ ఆర్ధిక సంఘ నిధుల నుండి గీతానగర్ ప్రొటెక్షన్ వాల్, గ్రీనరి, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు చేపట్టుటకు అవసరమగు టెండర్ పనులు చేపట్టి పనులు ప్రారంభించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తదుపరి దూరదర్శన్ క్వాట్టర్స్ ముందు గల సర్వీస్ రోడ్ నందు రోడ్ వెడల్పు వదిలి మిగిలిన మార్జిన్ యందు పవేర్ బ్లాక్ మరియు గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చర్యలు తీసుకోవాలని మరియు పోలీస్ కాలనీ నుండి నగరపాలక సంస్థ సరిహద్దు గల రిటైనింగ్ వాల్ వద్ద ఎటువంటి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా పోలీస్ కాలనీ నందు జరుగుతున్న కవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ విధానము పరిశీలించి విధులలో ఉన్న సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, 18 సంవత్సరాలు పైబడిన వారందరికి తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోనేలా అవగాహన కల్పించాలని అన్నారు.

పర్యటనలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడిశేటి రాధిక, మాజీ కార్పొరేటర్ బహదూర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 

More Press Releases