ఈనెల 7న అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ!

Related image

  • గుంటూరు వెళ్లనున్న జగన్
  •  సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యేలు
  • ఎమ్మెల్యేల వెంట ఇతర అధికారులు

ఈ నెల 7వ తేదీన అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేయటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరుకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో హెలిపాడ్‌ ప్రాంతాన్ని, సభా ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు విడదల రజిని, షేక్ ముస్తఫా, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వినర్ లేళ్ల అప్పిరెడ్డి పరిశీలించి అధికారులతో చర్చించారు.

More Press Releases