జాతీయ మహిళా కమిషన్ కు తెలంగాణ మహిళా కమిషన్ నివేదిక

Related image

హైదరాబాద్: మహిళా సంరక్షణ కోసం రాష్ట్రంలో మహిళా కమిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై 14 రాష్ట్రాల చైర్ పర్సన్ లకు వివరించిన సునీత లక్ష్మారెడ్డిజాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జాతీయ మహిళా కమిషన్ నిర్వహించిన సమీక్షలో 14 రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్ పర్సన్ లతో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 

తెలంగాణలో గత కాలంగా నిర్వహిస్తున్న మహిళా సేవా కార్యక్రమాలపై నివేదిక సమర్పించారు.ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై జాతీయ మహిళా కమిషన్ కు సునీతా లక్ష్మారెడ్డి వివరించారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా మహిళా కమిషన్ నిర్వహిస్తున్న లింగ వివక్షత, సైబర్ క్రైమ్స్, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, మహిళా సాధికారత, లింగ సమానత్వం, ఋతుచక్రం సమయంలో పరిశుభ్రత పాటించడం, గృహ హింస నిరోధక చట్టం మరియు తదితర మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

మహిళా సాధికారత, మహిళల రక్షణ, మహిళా అభ్యున్నతికి మరియు మహిళా చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు మరియు మానవ అక్రమ రవాణపై చేస్తున్న కార్యక్రమాల గురించి జాతీయ మహిళా కమిషన్ మరియు ఇతర రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్ పర్సన్ లకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళలకు చేరువగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్ లైన్ 9490555533 మరియు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ @SCWTelangana ద్వారా మహిళా కమిషన్ కి వస్తున్న పిర్యాదులు గురించి తెలియజేశారు. 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షి టీమ్స్, భరోసా సెంటర్స్, సఖి సెంటర్స్ ఏర్పాటు చేసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని చైర్ పర్సన్ చెప్పారు. అలాగే మహిళల రక్షణ, గౌరవం, సాధికారత పై అందరం సమిష్టిగా కృషి చేయాలని చైర్ పర్సన్ అన్నారు. మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో జాతీయ మహిళా కమిషన్ సారథ్యంతో మహిళల న్యాయపరమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి ‘లీగల్ సెల్‌’ ను ప్రారంభించామని అన్నారు.

అలాగే జిల్లాలోని బాలికల హాస్టళ్లు, కళాశాలలు మరియు ఆసుపత్రుల్ని ఆకస్మిక తనిఖీ చేస్తామని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు ఎన్జీవో తో కలిసి 'Wednesday Walk' పేరుతో ప్రతి బుధవారం గ్రామాల్లో లింగ వివక్షపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కొమ్ము ఉమాదేవి యాదవ్ , గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతి రావు మరియు సెక్రటరీ కృష్ణ కుమారి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  

More Press Releases