నెల్లూరు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన ఇన్ ఛార్జ్ ల నియామకం!

నెల్లూరు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన ఇన్ ఛార్జ్ ల నియామకం!

జనసేన పార్టీ నెల్లూరు పార్లమెంటుతో పాటు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డిని నియమించారు. సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఉయ్యాల ప్రవీణ్, సర్వేపల్లికి సుంకర హేమలత, ఆత్మకూరు నియోజకవర్గానికి మలిశెట్టి శ్రీధర్, కావలి నియోజకవర్గానికి అలహరి సుధాకర్, ఉదయగిరికి వేముల రాజాలను ఇన్ ఛార్జ్ లుగా పవన్ కల్యాణ్ నియమించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలతో మరోసారి చర్చించిన తర్వాత ఇన్ ఛార్జ్ ని నియమించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియమించే వరకు మనుక్రాంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

Jana Sena
Pawan Kalyan
Nellore District
Andhra Pradesh

More Press News