టీటీడీ చైర్మన్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Related image

తెలంగాణ నుంచి తిరుమల వచ్చే భక్తులకు శ్రీవారి ప్ర‌త్యేక‌ దర్శనం కోసం స‌ముచిత ప్రాధ‌న్య‌త క‌ల్పించాల‌ని తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని కోరారు. శ‌నివారం జూబ్లిహిల్స్ లోని సుబ్బారెడ్డి నివాసంలో మంత్రి ఆయ‌న‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తెలంగాణ నుంచి రోజూ వేలాది మంది భక్తులు తిరుమలేశుడి దర్శనం కోసం వస్తుంటారని, ఇక్క‌డి భ‌క్తుల‌కు ప్ర‌త్యేక‌ దర్శన భాగ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

More Press Releases