ప్రారంభమైన ఏపీ కేబినెట్.. కీలకమైన అంశాలపై చర్చ!

Related image

  • ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం
  • రూ.46 వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు
  • విధివిధానాలను ఖరారు చేయనున్న కేబినెట్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలకమైన అంశాలను చర్చించనున్నారు. రూ.46 వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు, మిల్లెట్, పప్పుధాన్యాల బోర్డుల ఏర్పాటు, చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం, ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ నియమాకాలతో పాటు ఇసుక రవాణాకు యువతకు వాహనాల మంజూరు తదితర ప్రతిపాదనలపై కేబినెట్ విధివిధానాలను ఖరారు చేయనుంది.

More Press Releases