గుంతకల్‌లో తమ మొట్టమొదటి సీఎన్‌జీ స్టేషన్‌ను ప్రారంభించిన ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌

Related image

  • అనంతపూర్‌ జిల్లాలో నాల్గవ సీఎన్‌జీ స్టేషన్‌ మరియు గుంతకల్‌ నగరంలో మొట్టమొదటి సీఎన్‌జీ స్టేషన్‌ ప్రారంభానికి ప్రతీకగా ఈ స్టేషన్‌ నిలుస్తుంది
  • ఏజీ అండ్ పీ ప్రథమ్, ఓ మెగా సీఎన్‌జీ ఎక్సేంజ్ మేళాను ప్రారంభించింది. ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ చేత నడుపబడుతున్న ఆటోలను సీఎన్‌జీ ఆటోలుగా అత్యంత అందుబాటు ధరలలో శ్రీ బాలాజీ , చిత్తూరు , ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు ; కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి మరియు అనంతపూర్ జిల్లాల్లో మార్చుకునే అవకాశం అందిస్తుంది.
  • గుంతకల్‌లో గ్రీన్‌ వీల్స్‌ సీఎన్‌జీ ర్యాలీ ప్రారంభం. దీనిలో సీఎన్‌జీ వాహనాలకు సంబంధించిన అన్ని విభాగాలనూ అంటే ఆటోలు, కార్లు, చిన్న మరియు తేలిక పాటి వాణిజ్య వాహనాలను సైతం కవర్‌ చేస్తూ సీఎన్‌జీ , దాని ప్రయోజనాల పట్ల అవగాహన విస్తరించనున్నారు.

అనంతపూర్‌, 03 మే 2022 ః భారతీయ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) పరిశ్రమలో అగ్రగామి సంస్ధ, ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ నేడు తమ మొట్టమొదటి సీఎన్‌జీ స్టేషన్‌ను గుంతకల్‌లో  దేవి దేవుంద్ర ఫిల్లింగ్‌ స్టేషన్‌ వద్ద ప్రారంభించింది. ఈ స్టేషన్‌ను హెచ్‌పీసీఎల్‌ సహకారంతో ఏర్పాటుచేశారు.  అనంతపూర్‌ జిల్లాలో ఇది నాల్గవ సీఎన్‌జీ స్టేషన్‌కు ప్రతీకగా నిలుస్తుంది. ఈ సీఎన్‌ జీ స్టేషన్‌ ఇప్పుడు ఈ ప్రాంత వాసులు సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుంది మరియు 30%–50% వరకూ ఆదా చేయడం ద్వారా స౅స్టెయినబల్‌ లివింగ్‌ దిశగా తీసుకువెళ్తుంది. సీఎన్‌జీకి ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ ఓ మెగా సీఎన్‌జీ ఎక్సేంజ్‌ మేళాను నిర్వహించింది. దీనిద్వారా అనంతపూర్‌ జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ఆటోలను సీఎన్‌జీ ఆటోలుగా అతి తక్కువ  ధరలో మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ ఎక్సేంజ్‌ మేళా, ఆటో డ్రైవర్ల మదిలో ప్రత్యేక స్ధానం పొందింది. సీఎన్‌జీగా తమ ఆటోలను మార్చుకోవడం ద్వారా ప్రతి నెలా దాదాపు 10వేల రూపాయల వరకూ వారు ప్రయోజనం పొందగలరు.  ఈ మేళాలో భాగంగా ఆటో డ్రైవర్లకు 15వేల  రూపాయల విలువైన ప్రయోజనాలను  ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ అందించింది.

గ్యాస్‌ ఆధారిత ఆర్ధికవ్యవస్థ దిశగా మళ్లాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా అట్టడుగు స్ధాయిలో కూడా చురుగ్గా పనిచేస్తూ, సీఎన్‌జీ యొక్క ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాన్ని కూడా కంపెనీ నిర్వహించింది. గ్రీన్‌ వీల్స్‌ ఆన్‌ సీఎన్‌జీ ర్యాలీ హనుమాన్‌ సర్కిల్‌ వద్ద ప్రారంభమై గుంతకల్‌ నగరంలో 5 కిలోమీటర్ల మేర జరిగింది. ఈ ర్యాలీ వీరప్ప దేవాలయం మీదుగా వెళ్లిఅక్కడ నుంచి ఆర్‌టీసీ బస్టాండ్‌   మీదుగా ర్యాలీ ప్రారంభమైన హనుమాన్‌ సర్కిల్‌ కు తిరిగి వచ్చింది. ఈ డ్రైవ్‌ను ఈ ప్రాంతంలో సుప్రసిద్ధ ఓఈఎం డీలర్‌షిప్స్‌ అయినటువంటి బజాజ్‌, పియాజ్జియో, మారుతీ సుజుకీ వంటి వాటి సహకారంతో నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని విభాగాల సీఎన్‌జీ వాహనాలైనటువంటి ఆటోలు, కార్లు, చిన్న మరియు తేలిక పాటి వాణిజ్య వాహనాలు కూడా పాల్గొనడంతో పాటుగా సీఎన్‌జీ మరియు దీని ప్రయోజనాలు గురించి అవగాహన విస్తరించారు.

ఈ ర్యాలీకి అనంతపూర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సభ్యులు శ్రీ డాక్టర్‌  టీ రంగయ్య ; గుంతకల్‌  అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు శ్రీ వై వెంకటరామి రెడ్డి ; ఏజీ అండ్‌ పీ ప్రఽథమ్‌ రీజనల్‌ హెడ్‌ శ్రీ జీఏ వెంకటేష్‌ తో పాటుగా ఇతర అతిథులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ రీజనల్‌  హెడ్‌  శ్రీ జీఏ వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘అందరికీ అందుబాటులో ఉండే కంప్రెస్ట్‌ నేచురల్‌ గ్యాస్‌ను అందించాలనే ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ యొక్క దృష్టిని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ఈ ర్యాలీ ఓ ప్రగతిశీల ముందడుగు. అనంతపూర్‌లో, ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ ప్రస్తుతం 1300 కేజీల నేచురల్‌ గ్యాస్‌ను ప్రతి రోజూ   సిండికేట్‌ నగర్‌, గూటీ, గుంతకల్‌, హిందూపూర్‌లో ఉన్న నాలుగు పంపిణీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తోంది. ఈ కంపెనీ మరో ఐదు కేంద్రాలను అనంతపూర్‌లో డిమాండ్‌ అధికంగా ఉన్న ప్రాంతాలలో మరో ఆరు నెలల్లో ప్రారంభించనుంది. జిల్లాలోని ఈ స్టేషన్‌, మరింతగా ఈ ప్రాంతంలో అభివృద్ధికి తోడ్పడటంతో పాటుగా మరింత మంది సీఎన్‌జీకి మారేందుకు, నిలకడతో కూడిన జీవన ప్రక్రియలను అనుసరించేందుకు తోడ్పడనుంది’’ అని అన్నారు.

పూర్తి పర్యావరణ అనుకూల వాతావరణ వ్యవస్థను రూపొందించడానికి ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ యొక్క నిరంతర ప్రయత్నాలతో,  ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌ ఇప్పుడు డీజిల్‌ , పెట్రోల్‌ లాంటి సంప్రదాయ ఇంధనాల కంటే మెరుగైన సీఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.  సీఎన్‌జీ కి భద్రత పరంగా శక్తివంతమైన రికార్డు ఉంది. ఇది వాహన  యజమానులకు ఆర్థిక ప్రయోజనాలను సైతం అందించడంతో  పాటుగా మొత్తంమ్మీద పర్యావరణ కాలుష్యం ఎదుర్కోవడంలో  సహాయపడుతుంది. అంతిమంగా,  ఇంధన సమృద్ధి, గ్యాస్‌ ఆధారిత ఆర్ధిక వ్యవస్థగా దేశం మారడంలో సహాయం చేస్తుంది.

ఏజీ అండ్‌ పీ యొక్క భారతదేశ వ్యాప్త సీజీడీ నెట్‌వర్క్‌  ఐదు రాష్ట్రాలు–  ఆంధ్రప్రదేశ్‌, రాజస్తాన్‌ , కేరళ, కర్నాటక,తమిళనాడు లో 34 జిల్లాల వ్యాప్తంగా 2,78,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కవర్‌ చేస్తున్నాయి.సంస్ధకు 1500కు సీఎన్‌జీ స్టేషన్‌లు ఉన్నాయి మరియు  17,000 ఇంచ్‌–కిలోమీటర్ల పైప్‌లైన్లు ఉన్నాయి. ఏజీ అండ్‌ పీ ప్రస్తుతం సీఎన్‌జీ స్టేషన్‌లను ఈ దిగవ జిల్లాలు : ఆంధ్రప్రదేశ్‌ :– అనంతపూర్‌, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు ; కర్నాటక :– కోలార్‌, మైసూరు, మాండ్య, హసన్‌, చిక్కమంగళూరు, కొడగు, బాగల్‌కోట్‌,  కొప్పల్‌, రాయ్‌చూర్‌, కాలాబురగి, విజయ్‌పుర, శివమొగ, హవేరీ  ; తమిళనాడు  :– కాంచిపురం, చెంగల్‌పేట, వెల్లూరు, రాణిపేట మరియు  రామనాథపరం ; కేరళ : –అల్లప్జుజ, కొల్లమ్‌ మరియు తిరువనంతపురం ; రాజస్తాన్‌ :– జోధ్‌పూర్‌, బార్మర్‌లో ఉన్నాయి.

ఈ సీఎన్‌జీ స్టేషన్‌లతో పాటుగా ఇతర సిటీ గ్యాస్‌ కంపెనీలు ఏర్పాటుచేసిన సీఎన్‌జీ స్టేషన్‌లతో అత్యంత కీలకమైన జాతీయ రహదారి మార్గాలు అయిన చెన్నై–బెంగళూరు ; బెంగళూరు– హైదరాబాద్‌ ; బెంగళూరు– మంగళూరు ; బెంగళూరు–మైసూరు ; మంగళూరు– హైదరాబాద్‌ ; చెన్నై– హైదరాబాద్‌ ; చెన్నై– బెంగళూరు–పూనె–ముంబై ; తిరువనంతపురం– కొచి– కోయంబత్తూరు– బెంగళూరు/చెన్నై మొదలైనవి సీఎన్‌జీ అనుసంధానితమయ్యాయి. ఈ మార్గాలలో వెళ్తున్న  వాహనాలు సీఎన్‌జీపై తమ కార్యకలాపాలు నిర్వహించవచ్చు.

More Press Releases