విజయవాడ నగర పాలక సంస్థలో టీచర్లకు పదోన్నతులు

విజయవాడ నగర పాలక సంస్థలో టీచర్లకు పదోన్నతులు
విజయవాడ నగర పాలక సంస్థలో పని చేయుచున్న 10 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు LFL Head Master మరియు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేయుచూ ఉత్తర్వులను మేయర్ రాయన భాగ్య లక్ష్మి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పిల్లల చదువులపై ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి గ్రేడులు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలనీ కోరుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులపై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా వాలంటీర్లను ఇచ్చినందుకు మరియు పదోన్నతులు ఇచ్చినందుకుగాను మేయర్ రాయన భాగ్య లక్ష్మికి, కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా బేగంకి, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కి, అదనపు కమీషనర్ జె. అరుణకి ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీచర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి KVRR రాజు, స్కూల్ సూపర్వైజర్ హుస్సేన్ పాల్గొన్నారు.  
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News