ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్.. ఫోటోలు

ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్.. ఫోటోలు
హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ‌లోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో ఏర్పాటు చేసిన‌ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కె. చంద్ర‌శేఖర్ రావు కలిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తదితరులు హాజరయ్యారు.
KCR
NV ramana
Supreme Court
Hyderabad
Telangana
iamc

Watch Today's Deals on Amazon

More Press News