స్పందనలో 13 అర్జీలు స్వీకరణ

స్పందనలో 13 అర్జీలు స్వీకరణ
విజ‌య‌వాడ‌: న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం అధికారులు నిర్వహించిన స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి పాల్గొని ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీక‌రించి అధికారులు క్షేత్ర స్థాయిలో పరివేక్షించి సమస్య పరిష్కారించేలా చూడాలని సూచించారు. నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ – 3, పట్టణ ప్రణాళిక -9, యు.సి.డి విభాగం – 1 మొత్తం 13 అర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు.

కార్యక్రమంలో సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఇతర అధికారులు ఉన్నారు.
VMC
Vijayawada

Watch Today's Deals on Amazon

More Press News