స్పందనలో 25 అర్జీలు స్వీకరణ: విజ‌య‌వాడ‌ మేయర్

 స్పందనలో 25 అర్జీలు స్వీకరణ: విజ‌య‌వాడ‌ మేయర్
  • క్షేత్ర స్థాయిలో పరిశించి పరిష్కరించాలి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజ‌య‌వాడ‌: న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ అధికారుల‌తో క‌లిసి స్పందన కార్యక్రమము నిర్వహించారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న వసతులలో ప్రజలు ఎదుర్కోను సమస్యలపై స్వయంగా 25 అర్జీల‌ను అందించి వారి ఇబ్బందులకు వివరించారు. సదరు అర్జీలను పరిశీలించిన మేయర్ మరియు కమిషనర్ క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిశీలించి పరిస్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కాగా నేటి స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) – 2, ఇంజనీరింగ్ – 5, పట్టణ ప్రణాళిక -7, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -5, ఎస్టేట్ విభాగం – 2, యు.సి.డి విభాగం – 4 వెలసి మొత్తం 25 అర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు.

కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, చీఫ్ ఇంజ‌నీర్ ప్ర‌భాక‌ర్ రావు, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి త‌దిత‌రులు ఉన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన
సర్కిల్ – 1 కార్యాలయంలో – ఎటువంటి అర్జీలు వచ్చియుండలేదు.
సర్కిల్ – 2 కార్యాలయంలో – 2 అర్జీలు పట్టణ ప్రణాళిక – 1 ఇంజనీరింగ్ సంబందించి-1,
సర్కిల్ – 3 కార్యాలయంలో – పట్టణ ప్రణాళిక & పబ్లిక్ హెల్త్ - 1 అర్జీ
ఆయా కార్యాలయాలలోని జోనల్ మరియు అసిస్టెంట్ కమిషనర్ లకు అందించుట జరిగింది.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News