సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన వీఎంసీ క‌మిష‌న‌ర్

Related image

విజయవాడ: ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. సంక్షేమ పథకముల వివరాలు విధిగా నోటీసు బోర్డులో ఉంచాలని పేర్కొన్నారు. శుక్ర‌వారం రామలింగేశ్వర నగర్ నందలి 68 మరియు 69 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పర్యటనలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

More Press Releases