ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక 'స్పంద‌న‌' కార్యక్రమం: విజయవాడ మేయ‌ర్ రాయ‌న భాగ్యల‌క్ష్మి

ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక 'స్పంద‌న‌' కార్యక్రమం: విజయవాడ మేయ‌ర్ రాయ‌న భాగ్యల‌క్ష్మి
విజయవాడ: స్పందన కార్యక్రమములో ప్రజల నుంచి వచ్చిన సమస్యల ఆర్జీల‌ను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేప‌ట్టాల‌ని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ (ఐ.ఏ.ఎస్) అధికారులను ఆదేశించారు.

విజ‌య‌వాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమములో మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి స్వయంగా ప్రజల నుంచి ఆర్జీల‌ను స్వీకరించారు. సామ‌న్య ప్ర‌జ‌ల స‌మ‌స్యలు ప‌రిష్కారించి వారి జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే స్పంద‌న కార్య‌క్ర‌మం లక్ష్యం అన్ని అన్నారు. ప్ర‌జ‌లు సమర్పించిన ఆర్జీలను పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు.

కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -6, పబ్లిక్ హెల్త్ – 3, యు.సి.డి – 2, జోనల్ కమిషనర్ / అసిస్టెంట్ కమిషనర్ III – 2, పేషి రిమర్క్స్ -1 మొత్తం 14 ఆర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు. స్పందన కార్యక్రమములో ప్రజల నుండి వచ్చిన సమస్యల ఆర్జిలను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ (ఐ.ఏ.ఎస్) అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, సిటీ ప్లానర్ i/c జె.సూరజ్ కుమార్, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.  
Vijayawada
Andhra Pradesh

More Press News