దిండిలో జనసేన మేధోమధనం!

Related image

  • దిండిలో 5, 6 తేదీలలో జనసేన మేధోమధనం
  • పీఏసీ సమావేశాలు
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు ఈ నెల 5, 6 వ తేదీలలో తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని దిండి గ్రామంలో జరగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ సమావేశాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు, యువ నాయకులతో వివిధ అంశాలపై మేధోమధనం జరుగనుంది.

గతంలో రాజకీయాలు - ఇప్పటి రాజకీయాలు, వ్యవసాయ రంగం, సభలు - సమావేశాలు - చర్చ కార్యక్రమాలలో పార్టీ వాణిని సమర్ధంగా వినిపించడం, సమాచార హక్కు, న్యాయ - ధర్మ సూత్రాలు, పౌర పాలన, స్థానిక స్వపరిపాలన వంటి అంశాలపై అవలోకనం, అవగాహనా సమావేశాలు జరుగుతాయి. వివిధ అంశాలలో నిపుణులయిన వారు ఈ మేధోమధనంలో పాల్గొంటారు. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాలుగో తేదీ సాయంత్రానికే దిండి చేరుకుంటారు.

More Press Releases