పవన్ కల్యాణ్ అమరావతి పర్యటన వివరాలు!

Related image

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి భవితవ్యంపై భూములిచ్చిన రైతులు, ఆ ప్రాంత ప్రజల్లో నెలకొన్న ఆందోళన, వారి బాధలను తెలుసుకొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 30వ తేదీన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారు. 30వ తేదీ ఉదయం 10 గంటలకు జనసేన పార్టీ కార్యాలయం, మంగళగిరిలో బయలుదేరుతారు. మంగళగిరి పాత బస్టాండ్ మీదుగా నిడమర్రు గ్రామం వెళ్తారు.

నిడమర్రు - కురగల్లు - ఐనవోలు, కొండవీటివాగు బ్రిడ్జ్, ఎస్.ఆర్.ఎమ్. యూనివర్సిటీ పరిశీలన - శాఖమూరు, విట్ యూనివర్సిటీ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ బిల్డింగ్స్ - శిల్పారామం - అంబేడ్కర్ స్మృతివనం - రిజర్వాయర్ పరిశీలన - ఎన్జీఓ క్వార్టర్స్ విజిట్ - హైకోర్టు - హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణ ప్రదేశ పరిశీలన - సచివాలయ భవనాల నిర్మాణ స్థలం పరిశీలన – న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల నిర్మాణ ప్రదేశం - ఐ.ఏ.ఎస్., ఎమ్మెల్యేలు నివాసం టవర్స్ – అనంతవరం గ్రామం, ఎన్.17 రోడ్ – అనంతవరం, ఎన్.16 రోడ్ – దొండపాడు – సీడ్ యాక్సిస్ రోడ్ - సి.ఆర్.డి.ఏ. బిల్డింగ్స్ – లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిశీలన. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిశీలనతో 30వ తేదీన పవన్ కల్యాణ్ పర్యటన ముగుస్తుంది.

More Press Releases