గవర్నర్ బిశ్వభూషణ్ ప్రశంసలు అందుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్

గవర్నర్ బిశ్వభూషణ్ ప్రశంసలు అందుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్
విజయవాడ, మార్చి 25: దేశంలోనే ఉత్తమ డీజీపీగా స్కోచ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన గౌతమ్ సవాంగ్ ఇటీవలి కాలంలో రాష్ట్ర పోలీసు శాఖ చేజిక్కించుకున్న వివిధ అవార్డులను గురించి వివరించారు. పోలీసింగ్, ప్రజా భద్రత, రాష్ట్ర పోలీసు శాఖలో సాంకేతిక సంస్కరణలను చేపట్టడం తదితర అంశాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన నేపథ్యంలో ఈ జాతీయ స్ధాయి అవార్డులు లభించించాయని డీజీపీ తెలిపారు.

స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ విభాగంలో ప్రతిష్టాత్మక ఫిక్కీ బెస్ట్ స్టేట్ అవార్డును గెలుచుకున్నామని, ఇంటర్‌జెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసిజెఎస్) ద్వారా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తో అనుసంధాన పరంగా దేశంలోనే అత్యుత్తమమైనదిగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైందని డీజీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో పురస్కారాలను గెలుచుకోవాలన్నారు. ప్రజా సేవ, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసు వ్యవస్ధ ముందుకు సాగాలన్నారు. డీజీపీ సవాంగ్ తో పాటు అవార్డులకు కారణమైన ఇతర పోలీసు అధికారులను గవర్నర్ హరిచందన్ అభినందించారు. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డిఐజి (సాంకేతిక సేవలు ) జి. పాలరాజు, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లాక్ డౌన్ సమయంలో రెడ్ క్రాస్ సేవలు స్పూర్తిదాయకం : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
కరోనా లాక్ డౌన్ వేళ రాష్ట్రంలో రెడ్ క్రాస్ అందించిన సేవలు స్పూర్తిదాయకంగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎపి స్టేట్ బ్రాంచ్ నిర్వహించిన సైకిల్ ర్యాలీ ముగింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు.  

విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ , గవర్నర్ కార్యదర్శి, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు ముఖేష్ కుమార్ మీనా పాల్గొనగా, నగరంలో ఎస్ఎస్ కన్వేన్షన్ నుండి రెడ్ క్రాస్ బాధ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అవగాహనా ర్యాలీ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, అనంతపూర్ నుండి వేరు వేరుగా విజయవాడకు చేరుకున్న సైకిలిస్టు బృందాలను స్వాగతించిన గవర్నర్ వారిని అభినందించారు.

గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ రక్తదానంతో జీవితాలను కాపాడవచ్చని, చెట్ల పెంపకం, పరిశుభ్రమైన వాతావరణంతో ఆరోగ్యకరమైన జీవితం సాధించవచ్చని ఈ ఇతివృత్తాలతో సైకిల్ ర్యాలీని విజయవంతం చేయటం శుభపరిణామమన్నారు. జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ విభాగాలు ఈ ర్యాలీలో కీలక భూమికను పోషించటం పలువురికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. యువతలో నాయకత్వ నైపుణ్యాలను వెలికీతీస్తూ, బృంద సూర్తిని చాటేలా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రెడ్ క్రాస్ రాష్ట్ర ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.కె. పరిడాలను గవర్నర్ అభినందించారు. జిల్లాల వారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్లు, రెడ్ క్రాస్ జిల్లా శాఖల అధ్యక్షులు, పోలీసు అధికారులు, ఇతర కార్యనిర్వాహకుల సేవలు వెలకట్టలేనివని గవర్నర్ ప్రస్తుతించారు.

కరోనా సంక్షోభ సమయంలో రెడ్‌క్రాస్ వాలంటీర్లు చేసిన సేవలను గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఐఆర్‌సిఎస్ యూనిట్లు ఆహారం, కూరగాయలు, ముఖ ముసుగులు, చేతి తొడుగులు, శానిటైజర్‌లు పంపిణీ చేయడం ద్వారా తమ సేవలు అందించి సంక్షోభ సమయంలో తమదైన స్పందనను ప్రదర్శించారన్నారు. వాలంటీర్లు వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకునేలా రవాణా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని సహాయం చేశారన్నారు. గత సంవత్సరం 13 లక్షల జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ వాలంటీర్లు సభ్యత్వం పొందినట్లు ఐఆర్‌సిఎస్ ఎపి స్టేట్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ ఎ. శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
Biswabhusan Harichandan
AP DGP
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News