పీవీ సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు!

Related image

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా నిలిచిన పీవీ సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. అద్భుత విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని సీఎం అన్నారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా, ఆదివారం స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్ లో సింధు 21-7, 21-7తో జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహరను ఓడించింది.

More Press Releases