గ్రేటర్ లో ఆహ్లాదభరితంగా శ్మశానవాటికల అభివృద్ది

Related image

  • రూ. 4.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న దనియాలగుట్ట వైకుంఠదామ పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జనవరి 19: శ్మ‌శానవాటిక‌ల‌ను పూర్తిస్థాయిలో ఆధునీక‌రించ‌డంతో పాటు బాధ‌తో వ‌చ్చే వారికి స్వాంత‌న ల‌భించే స్థ‌లాలుగా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని గ్రేవ్‌యార్డ్‌ల‌న్నింటినీ జీహెచ్ఎంసీ ఆధునీక‌రిస్తోంది. జీహెచ్ఎంసీ నిధుల‌తో కొన్ని శ్మ‌శాన‌వాటిక‌ల‌ను అభివృద్ది చేయ‌డం, మరికొన్నింటిని కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్ బులిటీ క్రింద ప‌లు ప్రైవేట్ సంస్థ‌ల‌తో అభివృద్ది చేయించింది.

దీనిలో భాగంగా రాయ‌దుర్గ్‌లోని శ్మశాన‌వాటిక‌ను స‌ర్వ‌హంగుల‌తో రూపొందించిన మహా ప్రస్థానం శ్మశానవాటిక దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఈ మ‌హాప్ర‌స్థానం సూప‌ర్‌ హిట్ కావ‌డంతో న‌గ‌రంలోని ఇత‌ర శ్మ‌శాన‌వాటిక‌లను జీహెచ్ఎంసీ అభివృద్ది చేసింది. వీటిలో పలు శ్మశాన వాటికల అభివృద్ది పనులు పూర్తికాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. పూర్తయిన వాటిలో ఇటీవల రూ. 2.96 కోట్ల వ్యయంతో బల్కంపేటలో నిర్మించిన వైకుంఠదామాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు.

రూ. 4.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బేగంపేట్ లోని దనియాలగుట్ట శ్మశానవాటిక అభివృద్ది పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు ప్రారంభించనున్నారు. ఆధునిక‌ వ‌స‌తుల‌తో నిర్మించనున్న ఈ శ్మశానవాటికలో ప్ర‌ధానంగా ప్ర‌హ‌రీగోడ‌ల నిర్మాణం, చితిమంట‌ల ఫ్లాట్‌ఫామ్‌ల నిర్మాణం, అస్తిక‌ల‌ను భ‌ద్ర‌ప‌రిచే సౌక‌ర్యం, ప్రార్థ‌న గ‌ది, వెయిటింగ్ ఏరియా, సెట్టింగ్ గ్యాల‌రీ, పార్కింగ్ సౌక‌ర్యం, న‌డ‌క‌దారి, ఆఫీస్ ప్లేస్‌, వాష్ ఏరియా, ఎల‌క్ట్రిఫికేష‌న్‌, హ‌రిత‌హారం, ల్యాండ్ స్కేపింగ్‌ల‌ను జీహెచ్ఎంసీ నిర్మించనుంది.

వీటితో పాటు ఫతేనగర్ లో నాలా విస్తరణ పనులు, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని ధనలక్ష్మి కాలనీలో నాలా విస్తరణ పనులు, బాలాజీనగర్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జె.ఎన్.టి.యు మంజీరా మాల్ వద్ద నిర్మించిన పార్కును ప్రారంభించడంతో పాటు కె.పి.హెచ్.బి 4వ ఫేజ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు, 6వ ఫేజ్ లో నాలా పనులకు, అల్లాపూర్ లో నాలా విస్తరణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

More Press Releases