రాజ్ భవన్ లో జనవరి 1న జరిగే ఓపెన్ హౌస్ రద్దు

Related image

  • ఫోన్ లోనే శుభాకాంక్షలు స్వీకరించనున్న గవర్నర్
హైదరాబాద్: కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా రాజ్ భవన్ లో ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన ఆనవాయితీగా నిర్వహించే ఓపెన్ హౌస్ ఈ సంవత్సరం రద్దు అయింది.

కోవిడ్-19 నివారణ నిబంధనలు పాటిస్తూ, ఈ ఓపెన్ హౌస్ ఈ సంవత్సరం రాజ్ భవన్ లో నిర్వహించడం లేదు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు ఉదయం 10 గంటల నుండి 11 గంటల మద్య ఒక గంట పాటు ఫోన్-ఇన్ ద్వారా ప్రజల నుండి శుభాకాంక్షలు స్వీకరిస్తారు. గవర్నర్ కి శుభాకాంక్షలు తెలియజేయాలనుకునేవారు 040-23310521 నంబర్ కు ఉదయం 10 గంటల నుండి 11 గంటల మద్య ఫోన్ చేయవచ్చు.

More Press Releases