తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంది: మంత్రి కేటీఆర్

Related image

  • ఎస్సీ, ఎస్టీల కోసం మరిన్ని కార్యక్రమాలు- మంత్రులు కే తారకరామారావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్
  • యస్సీ, యస్టీ కమిషన్ కార్యాలయంలో దళిత, గిరిజనులకు అందుతున్న కార్యక్రమాలపైన ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించిన మంత్రులు
  • యస్సీ, యస్టీ కమిషన్ వెబ్ సైట్ మరియు నూతన సమావేశ మందిరాన్ని ప్రారంభించిన మంత్రులు
  • యస్సీ, యస్టీలకు సంబంధించిన 100 కోట్ల సబ్సీడి నిధుల చెక్కు విడుదల
  • లబ్దిదారులకు చెక్కులు అందించిన మంత్రులు
  • సియం ఆలోచనల మేరకు కమిషన్ పనిచేస్తుందని, దళిత, గిరిజనులకు అండగా ఉంటున్నామన్న కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇప్పటికే అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రెండు వర్గాలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతున్నదని కేటీఆర్ తెలిపారు. ఒకవైపు వారి ప్రాథమిక అవసరాలైన విద్యా రంగంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూనే మరోవైపు వారి అభివృద్ధి కోసం వారిని పెద్ద ఎత్తున ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో వివిధ శాఖల సెక్రటరీలు మరియు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ లతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమీషన్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరంతోపాటు, వెబ్ సైట్ ను మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ తన ఆలోచనలను పంచుకున్నారు. దేశంలో కులాన్ని మూలధనం తోనే రూపుమాపే అవకాశం ఉన్నదని, ఆ దిశగా సాధ్యమైనంత ఎక్కువ మంది దళిత, గిరిజన వర్గాల నుంచి యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

ఇప్పటికే టీ ప్రైడ్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఈ రెండు వర్గాల యువకులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సుమారు రెండు వర్గాల్లో కలిపి ఇప్పటికే 36 వేల మంది కి జౌత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు యూనిట్లు ఇచ్చామని తెలిపారు. వీరందరికి త్వరలోనే సబ్సీడీలను అందిస్తామన్నారు. ఈరోజు సూమారు 2000 మందికి అవసరం అయిన 100 కోట్ల సబ్సీడీ మెత్తాన్ని పరిశ్రమల శాఖ తరపున విడుదల చేశారు.

ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులను మంత్రులు చెక్కులను అందించారు. సమాజంలో ఉన్న వాడు లేడు లేనివారు అనే తేడా ప్రధానంగా మారిందని ఆర్థికంగా అవకాశాలు లేని వారికి అవకాశాలు కల్పించే విధంగా పని చేస్తామన్నారు. ఎడ్యుకేషన్, ఏంత్రప్రెన్యూర్ షిప్, ఎంప్లాయిమెంట్ అనే 3 E ఈ సూత్రంతో నిమ్న వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టిన భారీ ప్రాజెక్టులు, ఇతర పాలన సంస్కరణ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని తెలిపిన కేటీఆర్, దళిత, గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా, పెట్టుబడి అవకాశాలు కల్పించే విషయంలోనూ అంతే ఆదర్శంగా ఉండాలి అన్నారు.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అవలంభిస్తున్న కార్యక్రమాలు, చర్యలను పున సమీక్షించి, దేశంలో ఇతర రాష్ట్రాల అవలంభిస్తున్న కార్యక్రమాలన్నింటినీ పైన అధ్యయనం చేసి దేశంలోనే ఆదర్శవంతమైన విధానంతో ముందుకు రావాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచనలు చేశారు.

తన పరిధిలో ఉన్న పరిశ్రమల శాఖ, మరియు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లు కలిసి ఈ దిశగా పని చేయాలన్నారు. త్వరలోనే మరో సారి  సమావేశమవుతామని అధికారులకు సూచించారు. ఆలోగా వినూత్నమైన విధానాలతో ముందుకు వస్తే ముఖ్యమంత్రి అనుమతితో మరింత ప్రభావవంతమైన పాలసీలతో ముందుకు పోదామని సూచించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకాలు, కార్యక్రమాల ద్వారా దళిత, గిరిజన యువకులకున్న అవకాశాలపైన అన్ని జిల్లాల్లో అవగాహన మేళాలు నిర్వహించాలన్నారు.  

యస్సీ, యస్టీ కమిషన్ ఏర్పడిన నాటి నుంచి చేపట్టిన చర్యలను మంత్రి కేటీఆర్ అభినందించారు. ముఖ్యంగా దళిత గిరిజనుల పైన జరుగుతున్న అట్రాసిటీ కేసులను పరిష్కరించి, వారికి తక్షణ సహకారం అందించడం వంటి చర్యలు ప్రశంసించారు. తమకు అప్పజెప్పిన బాధ్యతలను నిబద్దతతో ముందుకు తీసుకుపోతున్న కమిషన్ చైర్మన్, సభ్యులను అభింనందించారు. ముఖ్యంగా ఈ విషయంలో కమిషన్ సభ్యులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవడాన్ని మంత్రి  అభినందించారు

ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన మంత్రి కొప్పుల ఈశ్వర్, బాగా పనిచేస్తున్న యస్సీ, యస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ని మనస్ఫూర్తిగా అభినందించారు. గతంలో కూడా కమిషన్లు ఉన్నా..మొక్కుబడిగా ఉండెవని, రాజకీయ నాయకుల పునరావాసంగా ఉండెవని, కానీ సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు నేడు ఈ కమిషన్ పని చేయడం సంతోషంగా ఉందన్నారు.

కమీషన్ వద్ద పెండింగ్లో ఉన్న 92 శాతం కేసులను పరిష్కరించడం, జిల్లాల్లో పర్యటించడం వంటి చర్యలతో కమీషన్ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. తాజాగా బీసీ కమిషన్ కూడా 17 సంచార జాతులు గుర్తించి వారిని జాబితాలో చేర్చాలి అని ప్రతిపాదించడం కూడా గొప్ప విషయ మన్నారు. స్పృహ ఉన్న నాయకులు, సామాజిక బాధ్యత ఉన్న నాయకులు మంచి స్థానాల్లో ఉంటే ఎంత గొప్పగా పని చేస్తారనే దానికి యస్సీ, యస్టీ కమీషన్ పనితీరు నిదర్శనమన్నారు.

యస్సీ, యస్టీ కమిషన్ బాగా పని చేయడం పట్ల కమిషన్ చైర్మన్, సభ్యులను  *మంత్రి సత్యవతి రాథోడ్* అభినందించారు. ఈ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళిత, గిరిజన అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ పరిధిలో వచ్చే అన్ని సమస్యలను నేరుగా మనమే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. వారి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం పట్ల మరింత పెంచే విధంగా కృషి చేయాలని కమీషన్ కు సూచించారు. సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకం పెట్టి గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా మార్చుతున్నామని, ఎక్కువ మంది గిరిజన యువకులను పారిశ్రామిక వేత్తలు చేయడానికి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

ఈరోజు కమిషన్ నూతన సమావేశం మందిరాన్ని ప్రారంభించడంతోపాటు యస్సీ, యస్టీలకు అందుతున్న కార్యక్రమాలను సమీక్షించడానికి మంత్రులు రావడం పట్ల రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ న్యవాదాలు తెలిపారు.

గతంలో సమైక్య రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు కనీస వసతులు లేని పరిస్థితి ఉండేదని, ఈరోజు దేశంలోనే ఏ కమీషన్ కు లేని విధంగా అన్ని హంగులతో కూడిన కార్యాలయం తమకున్నదని అన్నారు. ఈ సందర్భంగా కమీషన్ చేపట్టిన కార్యక్రమాలను శ్రీనివాస్ మంత్రులకు వివరించారు.  కమీషన్ అద్యర్శ్యంలో పౌర హక్కుల దినోత్సవం ఎప్పటికప్పుడు నిర్వహించడం గొప్పగా భావిస్తున్నామన్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో ఏస్సి,ఎస్టీలు తమకు అన్యాయం జరిగితే నేరుగా కమిషన్ వద్దకు రావడం పట్ల మేము చాలా గర్వంగా భావిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞులమై ఉంటామని తెలిపారు.

పేద ప్రజలకు దగ్గర కావడం, కమిషన్ ద్వారా వారికి న్యాయం చేయడం, ప్రయోజనాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కమీషన్ కు భాగా సహకరిస్తున్నారని తెలిపారు. భవిష్యత్ లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు రాష్ట్రంలోని దళిత, గిరిజన వర్గాలకు ఈ కమిషన్ ద్వారా జరిగే పూర్తి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని మా కమిషన్ తరపున హామీ ఇస్తున్నామనని తెలిపారు.

ఐటీడీఏలలో ప్రి ఇంక్యుబేషన్, రీ ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటుకు ట్రైకార్, వి.హబ్ ఒప్పందం జరిగింది. దీంతో గిరిజన పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తారు. నేషన్ షెడ్యూల్ కాస్ట్ పైనాన్స్ డేవలప్ మెంట్ కార్పోరేషన్ ఇచ్చే రుణాలకు సంబందించి  తెలంగాణ యస్ యప్ సి కి వంద కోట్ల బ్యాంకు గ్యారంటీకి సంబంధించిన  పత్రాలను మంత్రులు  అందించారు.

KTR

More Press Releases