పీవీ సొంత గ్రామం 'వంగర'ను గొప్ప చారిత్రాత్మక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

దేశం గర్వించ తగ్గట్టుగా వంగరను గొప్ప చారిత్రాత్మక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కావల్సిన ప్రణాళికలు తయారు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర  ప్రోహిబిషన్ & ఎక్సైజ్, క్రీడలు, యువజన సంక్షేమం, టూరిజం మరియు కల్చర్ ఆర్కియాలజీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని భావితరాల వారు గుర్తుంచుకునే విధంగా దేశంలో ఆదర్శంగా నిలిచేందుకు పీవీ సొంత గ్రామం ప్రపంచస్థాయిలో గుర్తింపు తెవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు తాను టూరిజం మరియు సాంస్కృతిక శాఖ సెక్రెటరీ. కేయస్ శ్రీనివాస్ రాజు, రాష్ట్ర టూరిజం శాఖ ఏండి మనోహర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, శిల్పరామం ఈఈ అంజి రెడ్డి, ఆర్కియలోజి డిడి నారాయణ వంగరను సందర్చించి పర్యటక కేంద్రంకు కావలసిన అన్ని ఏర్పాట్లపై పీవీ బంధువులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

ఆర్థిక, రాజకీయ, భూ సంస్కరణలు చేసి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి పీవీ అని అన్నారు. తెలంగాణ గడ్డ నుండి పట్వారీ నుండి ప్రధాన మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి, భూసంస్కరణలు చట్టం చేసి మొట్ట మొదటగా తన 1000 ఏకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన ఘనత పీవీకి దక్కిందని అన్నారు.

తెలంగాణ గడ్డపై పుట్టిన పీవీ గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో, దేశ వ్యాప్తంగా నలుమూలల వ్యాపింపచేయడానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకున్నారని అన్నారు. రాజకీయంగా ఎన్నో పదవులు ఎంతో  ఉన్నత  స్థానంలో ఉన్న చివరికి ప్రధానమంత్రిగా పాలించిన పీవీ సామాన్య జీవితాన్ని అనుభవించరాన్నారు.

పీవీ మరణాంతరం ఏమాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, పార్లమెంటులో కూడా ఫోటో కూడా పెట్టలేకపోయారాన్నారు. ప్రపంచ స్థాయిలో పీవీ ఖ్యాతిని తెచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పీవీ పుట్టి పెరిగిన లక్నేపల్లి, వంగార గ్రామాలను ప్రసిద్ది ప్రజలకు తెలియజేసేందుకు మంచి టూరిజం కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రం నలుమూల నుండి పర్యాటకులు వచ్చే విదంగా టూరిజం సర్క్యూట్ చేయనున్నట్లు చెప్పారు.

స్వర్గీయ పీవీ నర్సింహ రావును రాజకీయంగా స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన వాడిన వస్తువుల భవిష్యత్తు తరాల వారికి తెలియజేసే విధంగా భవనాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామన్నారు. అతను వాడిన ప్రతి వస్తువు ఎప్పుడు ఏ పదవిలో ఉన్నప్పుడు వాడిన వివరాల సమాచారంతో పొందపరచడం జరుగుతుందని, ప్రజల సమస్యలపై తన వద్దకు వస్తె తానే స్వయంగా టైప్ చేసి ఇచ్చేవారు. అదే విధంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంను నేర్చుకొని కంప్యూటర్ కూడా తానే వినియోగించుకొని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి పరిష్కారం చేసేవారని గ్రామ ప్రజలు వివరించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

అంతకు ముందు మంత్రి పీవీ నర్సింహ రావు నివసించిన భవనాన్ని సందర్చించారు. రాష్ట్ర స్థాయి అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ రావు, పీవీ కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక కేంద్రానికి కావసిన చర్యలపై చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వంగరకు వచ్చినట్లు వివరించారు.
 
పీవీ నరసింహారావు నివసించిన భవనంలో అతను వాడిన వస్తువులకు ఒక్కొక్కటి గురించి క్లుప్తంగా విషయ సమాచారంతో భవనం లో ఏర్పాటు చేయాలని అదే విధంగా వరంగల్ నుండి సిద్దిపెట అర్ అండ్ బి రోడ్డు గ్రామాన్ని వచ్చే రోడ్డును డబల్ రోడ్డు చేసి ఇరువైపులా సుందరీకరణ ప్రత్యేక ఆకర్షణ గల ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో గల శివాలయం అభివృద్దితో పాటు దేవాలయ చరిత్ర పొందుపర్చడం వంగర చెరువును మినీ ట్యాంకుబండ్ గా తీర్చిదిద్దుతామన్నారు.

చెరువులో సస్పెన్షన్ బ్రిడ్జి, 7 ఏకరాల స్థలంలో  మోడల్ పార్కు ఏర్పాటు నిర్ణయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లి వారి ఆదేశాల మేరకు మరిన్ని నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందన్నారు.

పీవీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ పీవీ నర్సింహ రావు మరణించిన 16 సంవత్సరాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మా కుటుంబ సభ్యులను పిలిచి తెలంగాణ గడ్డపై పుట్టిన వ్యక్తి అతని గొప్పతనాన్ని స్మరించారని పీవీ నర్సింహ రావు గొప్పవ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఏడాది పొడువునా శత జయంతి ఉత్సవాలు జరుపుతామని చెప్పారని వివరించారు.

ఈ కార్యక్రమంలో పీవీ నర్సింహ రావు కుటుంబ సభ్యులు వాణి దేవి, పీవీ ప్రభాకర్ రావు కాశ్యప్, పీవీ మదన్ మోహన్ రావు, వాసుదేవ రావు, అర్డిఓ వాసు చంద్ర, ఎసిపి రవీందర్, తహశీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్, ఏంపిపి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases