అన్ని రాష్ట్రాల అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రుల స‌మావేశం

Related image

  • కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్ అధ్య‌క్ష‌త‌న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం
  • స‌మావేశంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అధ్యక్షతన అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర మంత్రుల సమావేశం ఇవాళ ఢిల్లీలో నిర్వహించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం నుంచి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకై చేపట్టాల్సిన విధి విధానాలపై కేంద్ర మంత్రి జవదేకర్ సమీక్షించారు. నగర వన పథకం (అర్బన్ ఫారెస్టేషన్), స్కూల్ న‌ర్స‌రీ యోజ‌న, 20 పాయింట్ కార్య‌క్ర‌మం క్రింద‌ మొక్క‌లు నాట‌డం, త‌దిత‌ర‌ అంశాలను సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. ఈ అరణ్య భవన్ నుంచి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

More Press Releases