ఈనెల 4వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన!

Related image

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండు రోజులపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఈ నెల 4 , 5 తేదీల్లో ముఖ్య నాయకులూ, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ పర్యటనలోనే క్యాన్సర్ తో కన్నుమూసిన జనసేన కార్యకర్త కొప్పినీడు మురళీకృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తారు. 4 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి పవన్ కల్యాణ్ చేరుకొంటారు. అక్కడి నుంచి సిద్ధాంతం, పెనుగొండల మీదుగా భీమవరం చేరుకొంటారు. అదే రోజు సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. 5 వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేరుకు చెందిన పార్టీ కార్యకర్త కొప్పినీడు మురళీ కుటుంబాన్ని పరామర్శిస్తారు. 2 గంటలకు నరసాపురం పార్లమెంటరీ పరిధిలోని కార్యకర్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు.

More Press Releases