ముంబై నుంచి వ‌చ్చిన వ‌ల‌స కార్మికుల‌కు క‌రోనా పాజిటివ్.. అధికారుల‌తో స‌మీక్ష చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

Related image

వ‌ల‌స కార్మికుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు మండ‌లం అమ్మాపురం, కంటాయ‌పాలెం, మ‌డిప‌ల్లె గ్రామాల‌ను రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సంద‌ర్శించారు.
ముఖ్యంశాలు:

  • ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించి గ్రామాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం, అధికారులు అండ‌గా ఉంటార‌ని భ‌రోసా క‌ల్పిస్తూ, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించిన మంత్రి ఎర్ర‌బెల్లి
  • ముంబై నుంచి ఈ మ‌ధ్య వ‌చ్చిన వ‌ల‌స కార్మికుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లుగా నిర్ధారించిన వైద్యులు
  • అమ్మాపురంలో ఒక‌రికి, కంఠాయ‌పాలెం, మ‌డిప‌ల్లెల్లో రెండు కేసులు చొప్పున పాజిటివ్ వ‌చ్చిన‌ట్లుగా మంత్రికి వివ‌రించిన అధికారులు
  • దీంతో ఆయా గ్రామాల‌ను క్వారంటైన్ చేసిన అధికారులు, పోలీసులు
  • క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వాళ్ళంద‌రినీ మ‌హ‌బూబాబాద్ జిల్లా హాస్పిట‌ల్ కి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు
  • కాగా, ఆయా గ్రామాల్లోకి ముంబ‌యి నుంచి వ‌చ్చిన వారు ఎవ‌రెవ‌రిని క‌లిశారు?  వారి ఆరోగ్య ప‌రిస్థితుల‌పై ఆరా తీస్తున్న అధికారులు
  • ఈ ద‌శ‌లో ప్ర‌జ‌ల్లో ధైర్యం క‌ల్పించి, భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని, సామాజిక‌, భౌతిక దూరం పాటిస్తూ, ఎవ‌రికి వారు లాక్ డౌన్ ని ప‌క‌డ్బందీగా పాటించాల‌ని సూచించిన మంత్రి ఎర్ర‌బెల్లి
  • స్వీయ నియంత్ర‌ణ‌లో ఉండాల‌ని, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించిన మంత్రి
  • అనంత‌రం అధికారుల‌తో స‌మీక్ష చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి
  • జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా ఎస్పీ, డిఎం అండ్ హెచ్ఓలు, తొర్రూరు పోలీసులు, ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో అమ్మాపురం, కంఠాయ‌పాలెం, మ‌డిప‌ల్లె గ్రామాల ప‌రిస్థితుల‌పై చ‌ర్చించిన మంత్రి
  • పూర్తి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితి మిన‌హా మ‌రొక‌రికి కూడా రాకుండా ఆ గ్రామాల‌ను క్వారంటైన్ చేయాల‌ని, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న చైత‌న్య‌ప‌రుస్తూండాల‌ని చెప్పిన మంత్రి
  • ఆయా గ్రామాలను క్వారంటైన్ చేసిన స‌మ‌యాల్లో మంచినీరు‌, ఆహారం, నిత్యావ‌స‌ర స‌రుకులు, ఇత‌ర స‌మ‌స్య‌లు లేకుండా జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని ఆదేశించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
  • గ్రామాల్లో వాలంటీర్ల‌ను నియ‌మించి, వారి ద్వారా ప్ర‌జావ‌స‌రాలు తీర్చాలి
  • ఇలాంటి స‌మ‌యంలో గ్రామాల్లోని నేత‌లు, ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాలి. ఆదుకోవాలి
  • ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కు గురి కావాల్సిన ప‌నిలేదు. ధైర్యంగా ఉండాలి
  • ప్ర‌భుత్వం అన్ని ర‌కాల జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్న‌ది.

More Press Releases