జర్నలిస్టులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి:అల్లం నారాయణ

Related image

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. న్యూడిల్లీలో మరో ఇద్దరు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఆ ఇద్దరు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన 13 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. జర్నలిస్టులందరూ ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు అప్పమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాణం కన్న విలువైనది ఏది లేదన్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

More Press Releases