తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల భారీ విరాళం

తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల భారీ విరాళం
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ.2 కోట్ల భారీ విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. దీనికి సంబంధించిన చెక్కును కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎం.ఎల్లా, కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర కె.ఎల్లా, ప్రెసిడెంట్ సాయి డి.ప్రసాద్ ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు. కరోనా వార్స్ నిర్మూలనకు త్వరలోనే వ్యాక్సిన్ ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ చైర్మన్ కృష్ణ ఎం.ఎల్లా తెలిపారు.
KCR
TRS
Telangana
Corona Virus

More Press News