నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల కోసం రూ.5ల‌క్ష‌ల విరాళం

Related image

  • హైద‌రాబాద్ లో మంత్రి ఎర్ర‌బెల్లికి అంద‌చేసిన విజ‌య్ శ్రీ‌నాథ్
హైద‌రాబాద్, మే 4: క‌రోనా నిర్మూల‌న‌లో భాగంగా విధించిన లాక్ డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న నిరుపేద‌ల‌ను ఆదుకోవ‌డంతో పాటు, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో వారికి నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేయ‌డం కోసం విజ‌య్ శ్రీ‌నాథ్ రూ.5 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. ఆ మొత్తాన్ని హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి సోమ‌వారం అంద‌చేశారు.

మంత్రి ఎర్ర‌బెల్లికి చిర‌కాల ప‌రిచితులైన విజ‌య్ శ్రీ‌నాథ్ మాట్లాడుతూ, క‌రోనా నిర్మూల‌న కోసం మంత్రి వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేసి ఆదుకుంటున్నార‌న్నారు. మంత్రి ద‌యాక‌ర్ రావు పేరుకు ద‌గ్గ‌ట్లుగా ద‌యామ‌యుడ‌ని, అందుక‌నే ఆయ‌న చేస్తున్న సేవ‌కు చేదోడువాదోడుగా ఉండ‌డానికే తాను ఈ నిధిని అంద‌చేస్తున్న‌ట్లు చెప్పారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని పేద‌లను ఆదుకోవ‌డానికి ఉప‌యోగించాల‌ని మంత్రిని శ్రీ‌నాథ్ కోరారు. మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, నిరుపేద‌ల‌ను ఆదుకోవాల‌ని ఉదార‌త‌ను చాటిన విజ‌య్ శ్రీ‌నాథ్ ని అభినందించారు.

More Press Releases