ఇవాళ ఒక్కరోజే 20వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించాం: తెలంగాణ మంత్రి వేముల

Related image

  • ఇవాళ్టి వరకు జిల్లాలో 30 శాతం మేర ధాన్యం కొనుగోలు చేశాం
  • రైతు సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ ద్యేయం
  • ట్రాన్స్పోర్ట్ కు ఇబ్బంది లేకుండా స్థానికంగా గుర్తించిన 25 అదనపు వాహనాలు సమకూర్చుకున్నాం
  • గడిచిన 24 గంటల్లో 504లారీల్లోని ధాన్యం రైస్ మిల్లర్లు అన్లోడ్ చేసుకున్నారు
నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కరోనా వైరస్ వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలంగాణ రాష్ట్ర రోడ్లు-భవనాలు,హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోందన్నారు. గురువారం ఒక్క రోజే 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉండగా.. అందుకు మొత్తం 355 కొనుగోలు కేంద్రాలకు పర్మిషన్ ఇచ్చామని, గురువారం 336 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగిందన్నారు. పెట్టుకున్న అంచనాకు 30శాతం అనగా 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 27 శాతం అనగా 1.62 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లర్లు అన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.

ఈ 336 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 1.83లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సేకరించిన వరి ధాన్యంలో 92% అనగా 1.68లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లుకు పంపడం జరిగిందన్నారు. దీంట్లో 96% అంటే 1.62లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లు అన్ లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు. ఈ రోజు వరకు 123 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు చెల్లించడం జరిగిందన్నారు.

జిల్లాలో నియోజకవర్గాల వారిగా సేకరించిన వరి ధాన్యంలో నిజామాబాద్ రూరల్ లో 86%,బాల్కొండ లో 85%,ఆర్మూర్ లో 87%,బోధన్ 98%,బాన్సువాడ 99% రైస్ మిల్లర్ల దగ్గర అన్ లోడ్ అయిందన్నారు. ట్రాన్స్పోర్ట్ కు ఇబ్బంది లేకుండా  స్థానికంగా ఉన్న వాహనాలు సమకూర్చుకోవాలన్న మంత్రి సూచనలకు మేరకు పీఏసీ చైర్మన్ లు,అధికారులు గురువారం 25 అదనపు వాహనాలు సమకూర్చారు.
గడిచిన 24 గంటల్లో 504లారీల్లోని ధాన్యం రైస్ మిల్లర్లు అన్లోడ్ చేసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.

ధాన్యం చెడిపోయిందన్న సాకుతో కానీ,కడతా పేరుతో రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తే  రైసు మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రంగాన్ని ఆదేశించారు. హమాలీల కొరత ఉన్న నేపథ్యంలో టెలికాన్ఫరెన్స్ లో సూచించినట్లు స్థానిక హమాలీలను సమకూర్చుకోవడానికి పీఏసీ ఛైర్మన్ లు చొరవ చూపాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం చివరి కేజీ వరకూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇస్తున్నానన్నారు. రైతులు చెప్పుడు మాటలు విని ఆందోళన గురికావొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని తెలిపారు.రైతులు ఎవరూ అధైర్య పడొద్దని ఈ సందర్భంగా మంత్రి భరోసానిచ్చారు.

More Press Releases