పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

Related image

గజ్వేల్ : గజ్వేల్ ఐఓసీ భవన్ లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.
మంత్రి హరీశ్ రావు కామెంట్స్:

  • కరోనా వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తున్నది
  • నిన్న కేవలం 2 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి
  • ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు
  • ఇందుకు ప్రజల సహకారం, వైద్యులు, పోలీసులు సేవలు అమోఘమని కొనియాడారు
  • కరోనా వైరస్ గురించి బ్రాహ్మణులకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని సూచించారు
  • ప్రతి ఒక్కరు మీటరు దూరం డిస్టన్స్ ఉండాలని, మాస్కులు ధరించాలి
  • ఇంకా కొన్ని రోజులు లాక్ డౌన్ కు సహకరిస్తూ.., ఇలాగే అందరం ఐక్యతతో కరోనా వైరస్ తరిమికొడదాం
  • ప్రతి ఒక్క రేషన్ కార్డు వినియోగదారునికి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం 1500 రూపాయలు బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

More Press Releases