ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతలు కూడా తోడవ్వాలి: తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్

Related image

  • వలసకూలీలకు నిత్యావసరాలు
  • దాతలు మరింతగా ముందుకు రావాలి
  • లాక్ డౌన్ కు సహకరించాలి... సామాజిక దూరం పాటించాలి
  • కరోనా లక్షణాలున్నట్లు అనుమానమొస్తే పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి
  • మహబూబాబాద్ లో వలసకూలీలకు నిత్యావసరాల పంపిణీలో తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, ఏప్రిల్ 15 : ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కు అందరూ సహకరించాలని, ఈ సమయంలో నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతలు కూడా తోడవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ఈరోజు మహబూబాబాద్ లోని వలస కూలీలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు ఆమె పంపిణీ చేశారు. కిట్టీ పార్టీ చేసుకునే మహిళలు, వారి పార్టీ చేసుకునే వ్యయాన్ని వలసకూలీల కోసం నేడు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. మహిళలు సామాజిక బాధ్యతలో ముందుకు రావాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో రేషన్ కార్డున్న నిరుపేదలకు 12 కిలోల రేషన్, 1500 రూపాయలు ఇస్తుంటే...రేషన్ కార్డు లేని నిరుపేదలకు 12 కిలోల రేషన్, 500 రూపాయలను ఇస్తోందని చెప్పారు. దీనికి తోడు అనేక మంది దాతలు కూడా నేడు ఆదుకునేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. నేడు మెప్మావాళ్లు కూడా మాస్క్ లు పంపిణీ చేసి ప్రజల భద్రతకు సహకరించడం అభినందనీయమన్నారు.

లాక్ డౌన్ మే నెల 3వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో అందరూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తూ ఇళ్లలోనే ఉంటూ సహకరించాలని కోరారు. ఈరోజు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు వీలైనంత సాయం చేయాలని మహబూబాబాద్ మహిళా నాయకులు కిట్టి పార్టీ చేసుకోవడానికి బదులు సిరి రేషన్ కార్డు లేని వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినందుకు అభినందిస్తున్నాను. ఇలాగే ఇంకా దాతలు ముందుకు రావాలి.

More Press Releases