'డ్రోన్ స్ప్రే' ను ప్రారంభించిన తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి

Related image

తొర్రూరు, ఏప్రిల్ 4: మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరులో తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు శ‌నివారం డ్రోన్ స్ప్రేను ప్రారంభించారు. డ్రోన్ సాయంతో పై నుంచి నేరుగా సోడియం హైపో క్లోరైడ్ ని స్ప్రే చేస్తారు. ఈ విధంగా స్ప్రే చేయ‌డం ద్వారా క‌రోనా వైర‌స్ నిర్మూల‌న జ‌రుగుతుంది. క‌రోనా వైర‌స్ ని స‌మూలంగా నాశ‌నం చేసే దిశ‌గా ఈ డ్రోన్ స్ప్రేయ‌ర్ ని వాడుతున్నారు. క‌రోనా వైర‌స్ పై ముప్పుటా దాడి చేయ‌డానికి ఈ డ్రోన్ స్ప్రే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. మంత్రి స్వ‌యంగా డ్రోన్ ని ఆప‌రేట్ చేశారు. ఇప్ప‌టికే ఈ డ్రోన్ స్ప్రేని వ‌రంగ‌ల్, న‌ర్సంపేట త‌దిత‌ర ప్రాంతాల్లో వినియోగించారు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తొర్రూరులో మొద‌టిసారిగా వినియోగిస్తున్నారు. త‌ద‌నంత‌రం ఈ డ్రోన్ స్ప్రేని అన్నిప‌ట్ట‌ణాలు, మండ‌ల కేంద్రాలు, గ్రామాల్లోనూ వినియోగిస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు

More Press Releases