బియ్యం, పప్పు పంపిణీతో వయోవృద్దులు, చిన్నారులకు గుప్పెడన్నం: కృతికా శుక్లా

Related image

కరోనా లాక్ డోన్ నేపథ్యంలో వృద్ధాశ్రమాలు, బాలల కేంద్రాలలో ఉన్నవారి కోసం ప్రభుత్వం చేపట్టిన ఉచిత బియ్యం, కంది పప్పు పంపిణీ పలువురికి గుప్పెడన్నం పెడుతుందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ మేరకు జిఓ నెంబర్ 58 జారీ చేయగా 13 జిల్లాలలో 729 బాలల సదనాలు ఈ అదేశాల వల్ల లబ్డి పొందనున్నాయని కృతికా శుక్లా తెలిపారు. ప్రభుత్వేతర సంస్ధల నేతృత్వంలో ఈ బాలల సదనాలు నడుస్తుండగా, 24,695 మంది చిన్నారులు ఈ కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్నారన్నారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో వీరిలో 21,725 మందిని వారి తల్లి దండ్రులు, సంరక్షకులకు అప్పగించగా, 2,944 మంది అనాధలు అయా సంస్ధలలోనే ఉన్నారని కృతికా శుక్లా వివరించారు. ప్రస్తుతం బాల సదనాలలో ఉన్న ప్రతి చిన్నారికి 10 కిలోల బియ్యం, కిలో కంది పప్పు పంపిణీ చేయనున్నామని, ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు ఆ పనులలో నిమగ్నమై ఉన్నారని స్పష్టం చేశారు.

పౌరసరఫరాల శాఖ సమన్వయంతో రానున్న రెండు రోజుల్లో బియ్యం, పప్పు వారికి చేరేలా చూస్తామన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 87 వయో వృద్దుల కేంద్రాలు సేవలు అందిస్తుండగా, వాటిలో దాదాపు 2000 మంది వయో వృద్దులు సేద తీరుతున్నారని వారు సైతం ఈ కార్యక్రమం ద్వారా స్వాంతన పొందుతారని కృతికా శుక్లా తెలిపారు. వృద్దాశ్రమాలు, బాలల సదనాలు కరోనా లాక్ డోన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ తరహా సంస్ధలు అన్నింటిలో ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు ఇవ్వాలని  అధికారులను అదేశించిన విషయం విదితమే.

More Press Releases