తెలుగు వారందరికి 'శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది' శుభాకాంక్షలు: తెలంగాణ గవర్నర్ తమిళిసై

Related image

'శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది' సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందేశం:

"శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర  ప్రజలకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు వారందరికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

తెలుగు ప్రజలందరూ ఈ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

శ్రీ శార్వరి నామ సంవత్సరం తెలుగు వారందరి  జీవితాలలో వెలుగులు నింపాలని, ఈ సంవత్సరం అంతా తెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని. కరోనా మహమ్మరిని అత్యంత ధైర్య    సాహసాలతో ఎదుర్కొని విజయం సాధించాలని హృదయ పూర్వకంగా ఆశిస్తున్నాను . ఈ నూతన సంవత్సరంలో మనం, మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులందరు ప్రభుత్వం సమయానుసారం ఇచ్చే అన్ని సూచనలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉందామనే సంకల్పం తీసుకొందాం."

More Press Releases