'హుషారు పిట్టలు' చిత్రం నుంచి 'మంగళస్నానం' లిరికల్‌ సాంగ్‌ విడుదల

'హుషారు పిట్టలు' చిత్రం నుంచి 'మంగళస్నానం' లిరికల్‌ సాంగ్‌ విడుదల
అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా మంగళస్నానం అనే హార్ట్‌ టచ్చింగ్‌ ఎమోషనల్‌ సాంగ్‌ను విడుదల  చేశారు. 

ఓ తండ్రి తన కూతురును ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాడో, ఆమెపై ప్రాణాలు పెట్టుకుని ఎలా ఉంటాడో ఈ పాటలో తెలుస్తుంది. తండ్రి కూతుళ్ల అనుబంధంతో ఈ పాట ఉంటుంది. ఎస్‌ఎస్‌ చిరంజన్‌ ఈ పాటకు సాహిత్యం అందించగా యోగి సురేష్‌, విహా ఈ గీతాన్ని ఆలపించారు. చరణ్‌ అర్జున్‌ సంగీతాన్ని అందించారు. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ '' తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అప్యాయత అనుబంధం తెలియజేసే పాట ఇది.  ఈ సినిమా యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు విడి విడిగా చూడాల్సిన కుటుంబ కథా చిత్రం. తప్పకుండా నేటి యువతకు హుషారు తెప్పిచే చిత్రం ఇది. నా రియల్‌లైఫ్‌లో నా చుట్టుప్రక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా చూసిన తరువాత అందరూ థ్రిల్ల్‌ అయ్యి షాక్‌ అయ్యి ఔట్‌ అవుతారు' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ '' ఫస్టాఫ్‌ యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో వెళ్లిన సెకండాఫ్‌లో ఓ మెచ్యూర్డ్‌ కంటెంట్‌ ఉంది. ఇది డెఫినెండ్‌గా మంచి సినిమా. ఈ సినిమా ద్వారా యూత్‌కు, తల్లిదండ్రులకు దర్శకుడు ఏదో విషయం చెబుతున్నాడు. ఈసినిమా చూసిన తరువాత అందరూ రెస్పాన్సబుల్‌గా ఫీలవుతారు. ఓ మంచి విషయాన్ని ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో ఈ సినిమాలో దర్శకుడు చెప్పాడు. ఆర్టిస్టులు కూడా ఎంతో నేచురాల్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది సక్సెస్‌ఫుల్‌ సినిమా' అన్నారు.


అన్షు, వాసవి గణేషన్‌, గోవర్థన్‌, సునీత్‌ మనోహర్‌, రమేష్‌, బలగం బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌-అర్జున్



Husharpittalu
Mangalasnanam
Tollywood
cinema

More Press News