‘టెక్నాలజీ నయీ, భరోసా వహీ!’ అని హామీ ఇస్తూ తెలంగాణలో తమ నూతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ల శ్రేణిని విడుదల చేసిన బజాజ్ ఆటో

Related image

బజాజ్ RE E-Tec 9.0, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, 8.9 kWh బ్యాటరీతో 178 కి.మీ (ARAI ధృవీకరణ ప్రకారం) పరిధిని అందిస్తుంది . దీని ధర రూ. 3, 65, 419/-(ఎక్స్-షోరూమ్ హైదరాబాద్,  ఫేమ్  II ప్రోత్సాహకం తరువాత )

హైదరాబాద్, 9 ఏప్రిల్ 2024: ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్రవాహన మరియు మూడు చక్రాల వాహన  కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్, తమ నూతన కార్గో మరియు ప్యాసింజర్ విద్యుత్ ఆటో  శ్రేణిని ఈరోజు హైదరాబాద్‌లో విడుదల చేసింది. ప్రయాణీకుల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ను  బజాజ్ RE E-Tec 9.0గా విడుదల చేసింది. 

బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ శ్రేణిని బజాజ్ ఆర్ & డి  సెంటర్‌లో డిజైన్ చేసి అభివృద్ధి చేశారు. వీటిని  వాలూజ్‌లోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ కొత్త వాహనాలు విస్తృత పరిధి , అత్యధిక లోడ్ మోసే సామర్థ్యం, దీర్ఘకాలిక  మన్నిక కోసం  రూపొందించారు. 

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లలో IP67 రేటెడ్ అధునాతన Li-ion బ్యాటరీ, టూ-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ (PMS) మోటరు వున్నాయి. బ్యాటరీని 16-amp, 220 V ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌లో ఛార్జ్ చేయవచ్చు. ఈ వాహనాలు 5 సంవత్సరాలు లేదా 1.2 లక్షల కిమీల  వారంటీతో పాటు, కస్టమర్‌లకు భరోసా ఇవ్వడానికి, 24/ 7  రోడ్‌సైడ్ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటుంది. 

బాబ్జి నెల్లి, డివిజనల్ మేనేజర్ సేల్స్ మరియు కుబేర్. కె వి , డివిజనల్ మేనేజర్ సర్వీస్ , బజాజ్ ఆటో లిమిటెడ్‌ మాట్లాడుతూ  “కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను ప్యాసింజర్ మరియు కార్గో ఫార్మాట్‌లలో అందించడం సంతోషంగా వుంది.  ఈ సురక్షితమైన, విశ్వసనీయమైన , అధిక-పనితీరు గల వాహనాలను అభివృద్ధి చేయడానికి వినియోగదారుల పట్ల మా లోతైన అవగాహనను ఉపయోగించాము. వినియోగదారులకు మా సేవలను విస్తరించేందుకు తెలంగాణ వ్యాప్తంగా మా  డిస్ట్రిబ్యూషన్ సేవలను విస్తరించనున్నాము " అని అన్నారు 

   

More Press Releases