చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్ లు మరియు పేద మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ

Related image

చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో  25 పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్ లు  మరియు మహిళా స్వయం సాధికారకలో భాగంగా కుట్టు మిషన్ శిక్షణ పొందినటువంటి 8 మంది మహిళలకు శ్రీ ఇన్ఫో సిస్టం సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో (CSR Funds) ఆదివారం 31-03-2024, ఎస్.వి.ఎస్.ఎస్. నివాస్, TriCAD, Czech Colony ప్రాంగణంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్ లు, కుట్టుమిషన్లు పంపిణీ చేయడం జరిగింది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో మహిళా లోకానికి అండగా నిలవడంలో ప్రతి సేవా సంస్థ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫౌండేషన్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లు ప్రసాద్, రాజశేఖర్ చందు, డాక్టర్ రాఘవయ్య, సంపత్, రమాదేవి, శేషగిరి రావు, సురేష్, మాధవి, నవీన్, రమణి, రషీద్ తదితరులు పాల్గొన్నారు

More Press Releases