రాజధాని గ్రామాల్లో రెండు రోజులపాటు పవన్ కల్యాణ్ పర్యటన!

Related image

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజులపాటు కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏ ఏ గ్రామాలు సందర్శించాలో నిర్ణయించవలసిందిగా స్థానిక నాయకులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. అయితే పర్యటన తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇటీవల అసెంబ్లీ ముట్టడి సందర్భంగా గాయపడిన వారు పవన్ కల్యాణ్ ని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో మరోసారి పర్యటించాలని వారు కోరారు. పర్యటన ఎక్కడెక్కడ జరగాలి, ఏ విధంగా జరగాలి అనే కార్యాచరణను పార్టీ నాయకులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

More Press Releases