కమల్ షా కొత్త పుస్తకం "సిల్వర్ లైనింగ్" ను ఆవిష్కరించిన డాక్టర్ శశి థరూర్

Related image

హైదరాబాద్, 27 మే 2023: నెఫ్రోప్లస్ సహ వ్యవస్థాపకుడు, రచయిత కమల్ షా రచించిన "సిల్వర్ లైనింగ్ - ఓవర్‌కమింగ్ అడ్వర్సిటీ టు బిల్డ్ నెఫ్రోప్లస్, ఇండియాస్ లార్జెస్ట్ డయాలసిస్ ప్రొవైడర్" అనే కొత్త పుస్తకాన్ని భారత రాజకీయ నాయకుడు, ఎంపీ డాక్టర్ శశి థరూర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని ఉషా ఉతుప్ కూడా పాల్గొన్నారు. ఈ పుస్తకం కమల్ షా  ప్రయాణాన్ని వివరిస్తుంది. ఆయన ఆత్మస్థైర్యం,  పట్టుదల అద్భుతమైన విజయాలకు ఎలా దారి తీసిందో తెలియజేస్తుంది.

 
భారతదేశంలోని ప్రముఖ ప్రచురణకర్తలలో ఒకరైన పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించిన ఈ పుస్తకం, యువ కమల్ షా తన భారీ ఆరోగ్య వైఫల్యాలను అధిగమించి, ఈరోజున భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య సంస్థల్లో ఒకటిగా ఉన్న సంస్థను ఎలా నిర్మించారో తెలియజేస్తుంది. భారతదేశంలో ఈ తరహాలో మొదటిదైన ఈ కథ, 21 ఏళ్ల కమల్ షా కిడ్నీ వైఫల్యం ఆయన జీవితాన్ని ఎలా ముప్పుతిప్పలు పెట్టింది, పదే పదే  ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ఆయన తన మనుగడ కోసం మాత్రమే కాకుండా అభివృద్ధి చెందడానికి ఎలా పోరాడాడు అనేదానికి ఈ పుస్తకం సాక్ష్యంగా ఉంది.

 
నెఫ్రోప్లస్ సహ-వ్యవస్థాపకుడు కమల్ షా తాను విభిన్న సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యక్తులను చూడడంతో త న కథను వివరిస్తారు. "వారు ఒంటరిగా లేరని నేను వారికి తెలియజేయాలనుకుం టున్నాను, రహదారి ఎంత కఠినమైనదిగా అనిపించినప్పటికీ, ముందుకు వెళ్లడాన్ని ఆపలేరు. కిడ్నీ వ్యాధి వచ్చిన తర్వాత నేను చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను, కానీ అవి నన్ను బలవంతుడిగా చేశాయి. నేను బాధ,  కష్టాలను తీసుకుని వాటి ని పాఠాలుగా మార్చుకున్నాను. ఆరోగ్య సంరక్షణ రంగంలో పరిష్కారాలను తీసుకురాగలిగినందుకు నేను సం తోషిస్తున్నాను. నా పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.
 

జీవితం తనపై విసిరిన ప్రతి సవాలును అధిగమిస్తూ, కమల్ షా తన బలం,  ధైర్య సాహసాల ప్రయాణం ద్వారా తనతో పాఠకులను తీసుకువెళుతున్న కథన స్వరంలో సిల్వర్ లైనింగ్ రాయబడింది. పుస్తకం మొదటి భాగం లో కమల్ షా  తన భయంకరమైన ప్రయాణాన్ని ఉల్లాసమైన స్వరంతో వివరిస్తారు. ఆయన భాష భావోద్వేగం, ఉత్తేజాన్ని కలిగిస్తుంది, జీవితంలో ఇలాంటి ఆరోగ్య సవాళ్లు లేదా ఎదురుదెబ్బలను ఎదుర్కొనే ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది.

 
పుస్తకం  రెండో భాగం కమల్ వ్యవస్థాపక ప్రయాణాన్ని, వ్యక్తిగత అనుభవాన్ని  నెఫ్రోప్లస్‌ను భారతదేశంలోని అతిపెద్ద డయాలసిస్ కేంద్రంగా మార్చడానికి ఎలా ఉపయోగించాడు, అది రోగుల చికిత్స పట్ల మక్కువ చూ పుతూ, వారు మంచి జీవితాన్ని గడిపేందుకు ఎలా తోడ్పడుతుందో వివరించారు. రోగుల కోసం ప్రపంచం లోని మొట్టమొదటి డయాలసిస్ ఒలింపియాడ్ వంటి ఈవెంట్‌ల ద్వారా వారు నాణ్యమైన జీవితాలను గడిపేందుకు నెఫ్రోప్లస్‌లో ప్రోటోకలైజ్డ్ డయాలసిస్ కేర్‌ను పరిచయం చేయడం గురించి ఇది తెలియజేసింది.

పుస్తకానికి ముఖ్య అతిథి, రాజకీయ నాయకుడు, ఎంపీ డాక్టర్ శశి థరూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "కమల్ షా, స్వయంగా డయాలసిస్ రోగి. తన వ్యాధిని తనను ఓడించడానికి నిరాకరించాడు. బదులుగా, అతను దానిని తన స్ఫూర్తికి మూలంగా ఉపయోగించాడు; తాను బాధ పడినట్లుగా ఇతరులు బాధ పడకుండా ఎలా నిరోధించగలం? అని ఆలోచించాడు. ఈ ఫోకస్డ్ మిషన్ నెఫ్రోప్లస్‌కు దారితీసింది. ఇదే షా ఇక్కడ నేర్పుగా చెప్పే కథ. అతని ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. తరతరాలకు,  ఇంకా పుట్టని తరాల కోసం సైతం దానిని ఎప్పటికీ నిర్వహణలో ఉంచాలని అతను నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను" అని అన్నారు.

     
డాక్టర్ శశి థరూర్‌తో పాటు, నేపథ్య గాయని ఉషా ఉతుప్, రచయిత, బిజినెస్ కామెంటేటర్, టాటా సన్స్‌  మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ గోపాలకృష్ణన్, చలనచిత్ర నిర్మాత మధు మంతెన కూడా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెజాన్‌తో సహా అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు, ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ పుస్తకాన్ని పొందవచ్చు.

 
విక్రమ్ వుప్పాలతో కలిసి కమల్ షా స్థాపించిన నెఫ్రోప్లస్ రోగి-కేంద్రీకృత డయాలసిస్ కంపెనీ. ఇది భారత దేశంలో, వెలుపల మూత్రపిండాల సంరక్షణ, చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఈ బ్రాండ్ నేడు దేశవ్యాప్తంగా,  వెలుపల పలు కేంద్రాలతో విస్తరించి ఉన్నభారతదేశ అతిపెద్ద డయాలసిస్ సేవల సంస్థ.

 నెఫ్రోప్లస్ గురించి:

 
నెఫ్రోప్లస్ భారతదేశంతో సహా 4 దేశాల్లోని 200 నగరాల్లో 320 డయాలసిస్ కేంద్రాలను నిర్వహిస్తోంది. అది తన నాణ్యతా దృష్టి, రోగి-కేంద్రీకృతానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా డయాలసిస్‌లో ఉన్న వ్యక్తులు సుదీర్ఘ మైన, సంతోషక రమైన, ఉత్పాదక జీవితాలను గడపడానికి వీలు కల్పించే లక్ష్యంతో కంపెనీ 13 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. కంపెనీ నెలకు 22,000 రోగులకు చికిత్స చేస్తుంది. 80 లక్షల చికిత్సలను నిర్వ హించింది.  

More Press Releases