హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో

Related image

హైదరాబాద్‌,  18 మార్చి 2023 :  అంతర్జాతీయ ఆతిథ్య సాంకేతిక వేదిక ఓయో,  2023 సంవత్సరానికిగానూ  150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను హైదరాబాద్‌లో  తమ పోర్ట్‌ఫోలియోకు జోడించనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా పెరుగుతున్న వ్యాపార యాత్రికులకు తగిన మద్దతు అందించడానికి ఓయో రూమ్స్‌ ప్రణాళిక చేసింది.  ఓయో రూమ్‌ యొక్క విస్తరణ ప్రధానంగా అత్యంత కీలకమైన వ్యాపార కేంద్రాలైనటువంటి గచ్చిబౌలి, హై–టెక్‌ సిటీ, లకడీ కా  పూల్‌ మరియు ఎయిర్‌ పోర్ట్‌ చుట్టుపక్కల ప్రాంతాలు ఉండనున్నాయి.


ఓయో యొక్క ప్రీమియం హోటల్‌ బ్రాండ్‌లలో  టౌన్‌హౌస్‌ ఓక్‌, టౌన్‌హౌస్‌, కలెక్షన్‌ ఓ మరియు క్యాపిటల్‌ ఓ ఉన్నాయి.  ఓయో ఇప్పుడు తమ తొలి దశ విస్తరణలో ప్రధానంగా టౌన్‌హౌస్‌ ఓక్‌, టౌన్‌హౌస్‌ పై దృష్టి సారించనుంది.


హోటల్‌ యజమానులు , విస్తృత శ్రేణి, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సేవలతో ప్రయోజనం పొందగలరు.  వీటిలో సంభావ్య  అతిథులకు ఓయో రూమ్స్‌ నెట్‌వర్క్‌ లో ఉన్న 15వేలకు  పైగా కార్పోకేట్‌ ఖాతాలు  మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్న 10వేలకు పైగా ట్రావెల్‌ ఏజెంట్లతో కూడిన నెట్‌వర్క్‌ సహాయంతో చేరుకునే అవకాశం, చెల్లింపుల  సౌకర్యమూ అందిస్తుంది. ఓయో యాప్‌, వెబ్‌సైట్‌ మరియు ఇతర కీలక ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెంట్లు (ఓటీఏలు) ద్వారా లభించే దానికి అదనంగా ఇది అదనంగాలభిస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేస్తున్న మూడవ ట్రావెల్‌ యాప్‌గా ఓయో నిలిచింది.


దీనితో పాటుగా,  వారు ఓయో ప్లాట్‌ఫామ్‌ యొక్క నమ్మకం మరియు భద్రత ప్రయోజనాలను సైతం పొందగలరు. అలాగే, ఓయో యొక్క కృత్రిమ మేథస్సు శక్తివంతమైన యో ! చాట్‌  మరియు సమగ్రమైన కస్టమర్‌ సపోర్ట్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా  24 గంటలూ వినియోగదారుల సేవా మద్దతు పొందగలరు.


ప్రీమియం హోటల్స్‌కు  గత కొద్ది నెలలుగా డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. దీనికి దేశీయంగా లీజర్‌ ట్రావెల్‌, ట్రాన్సియంట్‌ ట్రావెల్‌ కు డిమాండ్‌ పెరగడం, మీటింగ్స్‌, ఇన్సెంటివ్స్‌, వెడ్డింగ్స్‌ విభాగం కారణంగా డిమాండ్‌ పెరగడం మరియు బిజినెస్‌ ట్రావెల్‌ కోలుకోవడం, విదేశీ యాత్రికులు రాక (ఎఫ్‌టీఏ) వంటివి దీనికి కారణాలు.
క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఐసీఆర్‌ఏ నివేదిక వెల్లడించే దాని ప్రకారం, భారతదేశంలో హోటల్‌ రూమ్‌ సరఫరా ఐదు సంవత్సరాల కాలానికి 3.5–4% వృద్ధి చెంది అదనంగా 15వేల రూమ్‌లను దేశవ్యాప్తంగా ప్రీమియం ఇన్వెంటరీ అయిన దాదాపు 94వేల రూమ్‌లకు 2023 ఆర్ధిక సంవత్సరంలో జోడించనుంది.


ఈ విస్తరణ ప్రణాళికలను గురించి ఓయో చీఫ్‌ మర్చంట్‌ ఆఫీసర్‌ అనూజ్‌ తేజ్‌పాల్‌  మాట్లాడుతూ ‘‘ ఇటీవలి కాలంలో ప్రజలు అధికంగా అనుభవాలపై అధికంగా వెచ్చించడానికి ఆసక్తి చూపుతుండటం కనిపిస్తుంది. అందువల్ల , హోటల్స్‌ ఇప్పుడు అదనపు సేవలు మరియు సౌకర్యాలను వారి ప్రయాణ అనుభూతులను వృద్ధి చేసేందుకు  వీలుగా మెరుగుపరుస్తున్నాయి మరియు అతిథులకు మరింత సౌకర్యమూ అందిస్తున్నాయి. మా విస్తరణ ప్రణాళిక ప్రధానంగా ప్రీమియం హోటల్స్‌ వృద్ధిపై దృష్టి సారించి ఈ ధోరణికి అనుగుణంగా ఉంటుంది’’ అని అన్నారు.


ప్రీమియం హోటల్స్‌పై  ఓయో దృష్టి సారించడం 2022 చివరి త్రైమాసంలో ప్రారంభమైంది.  అక్టోబర్‌ మరియు డిసెంబర్‌ మధ్యకాలంలో  400 నూతన ప్రీమియం హోటల్స్‌ను జోడించారు.


సంప్రదాయ బిజినెస్‌ ట్రావెల్‌కు శక్తివంతమైన వృద్ధి అవకాశాలున్నాయి. 2023లో  ప్రత్యామ్నాయ వ్యాపార ట్రావెల్‌  అదనపు వృద్ధిని సైతం జోడించనుంది.  బ్లీజర్‌ ట్రావెల్‌, లీజర్‌ కోసం వర్క్‌ ట్రిప్స్‌ను విస్తరించడం మరియు ఫ్లెక్సికేషన్స్‌, రిమోట్‌ వర్క్‌ను లీజర్‌ ట్రావెల్‌తో కలపడం వంటివి రాబోతున్న ధోరణులు మాత్రమే కాదు, వృద్ధికి సైతం ఓ ఆకృతిని అందించనున్నాయి.
 
 

More Press Releases