విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్న గాంధీ చిత్రం

Related image

  • ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 552 దియేటర్లలో ప్రదర్శించ బడుతున్న  "గాంధీ  సినిమా
  • ప్రతిరోజు 2.50 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా గాంధీ చిత్రాన్ని చూపిస్తున్న ప్రభుత్వo
  • నేటి వరకు గాంధీ చిత్రాన్ని తిలకించిన 22.50 లక్షల మంది విద్యార్థులు
  • ఈ నెల 21 వరకు గాంధీ చిత్ర ప్రదర్శన
  • ఆగస్టు 9 నుంచి 11 వరకు, ఆగస్టు 14 నుంచి 21 వరకు రాష్ట్రావ్యాప్తంగా ప్రదర్శితమౌతున్న గాంధీ సినిమా
హైదరాబాద్:18 ఆగష్టు,22: నాటి దేశ పరిస్థితిని,స్వాతంత్ర్య ఉద్యమ తీరును, ఉద్యమకారుల త్యాగాలను నేటి తరమునకు అవగాహన కల్పించుటకై జాతిపిత మహాత్మా గాంధీ బయోపిక్ ను చూపాలని అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నేటి పిల్లలు దేశ భక్తి, నైతిక విలువలు, సామాజిక దృక్పథం, సమైక్యత భావనలు పెంపొందించే విధంగా గాంధీజీ జీవితము నిలుస్తుంది. అందువల్లనే పాటశాల విద్యార్థులకు ఉచితంగా గాంధీ చిత్రాని హిందీ, ఇంగ్షీషు వెర్షణల్లో ప్రతి రోజు మార్నింగ్ షో గా ప్రదర్శనలు చేస్తునారు.

75 ఏండ్ల స్వపరిపాలనలో సాధించిన ప్రగతిని స్వాతంత్ర్య ఉద్యమకారుల ఆకాంక్షలతో భేరిజు వేసుకునేందుకు  వజ్రోత్సవవేడుకలు దిశానిర్దేశం చేస్తున్నాయి.

నాటి స్వాతంత్ర ఉద్యమ తీరు తెన్నులు -- బ్రిటిష్ వారి దమనరీతిని దీటుగా ఎదుర్కొనేందుకు సువిశాల దేశంలోని ప్రజలందరిని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా  ఐక్య పరిచేందుకు తరతరాలుగా భారతీయులు ఆశరిస్తున్న అహింసనే ఆయుధంగా చేసుకుని భారత స్వాతంత్రోద్యమానికి దిక్సూచిగా నిలిచిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. ఆయన జీవితమే ఒక ఉద్యమం. నాటి వ్యవస్థ, పాలనా తీరు, పాలకుల వైఖరిపైన సంపూర్ణ అవగాహన కలగిన వ్యక్తి గాంధీ. ఇంగ్లాండులో భారీష్టరు చదివి, దక్షిణాఫ్రికా లో న్యాయవాదిగా పనిచేసిన తొలిరోజుల్లోనే బ్రిటిష్ జాత్యాహంకారం పైన అహింసాత్మక నిరసనను వ్యక్తం చేశారు. అహింస బలహీనత కాదని.. వ్యక్తి మానసిక పటుత్వానికి ప్రతీకగా ప్రగాఢముగా విశ్వశించి, ఆచరించిన గొప్ప వ్యక్తి గాంధీ., అనంతరం దేశానికి తిరిగివచ్చి సత్యం -అహింసలను ఆయుధాలుగా దేశ ప్రజలను సంఘటిత పరచి స్వాతంత్ర ఉద్యమంకు నాయకత్వం వహించారు. దాదాపు రెండు శతాబ్దాల పాటు రగిలిన స్వేచ్చాపిపాసను నెరవేర్చారు.అన్ని వర్గాలు, మతాలు, కులాల ప్రజల మధ్య ఐక్యతను ఆకాంక్షిస్తూ తుదిశ్వాస విడిసిన మహనీయుడు గాంధీ. 

1948 లో మృతిచెందిన మహాత్మా గాంధి జీవిత గాధను 1882 లో ఇంగ్లిష్ లో తీసిన "గాంధీ బయోపిక్" ని నాడు ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల మంది చూశారు. గాంధీ బయోపిక్ ను చూచిన ప్రముఖులు 20 వ శతాబ్దంలో ఈ భూమిపైన అవతరించిన మహనీయునిగా గాంధీని పొగిడారు. మహాత్మా గాంధీ ప్రవచించిన సత్యం -అహింస లు అనేక దేశాల్లో జరిగిన స్వాతంత్ర్య పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయి. హక్కుల కొరకు జరిగే పోరాటంలో మార్టిన్ లూధర్ కింగ్ కు గాంధి సిద్ధాంతాలే మూలంగా నిలిచాయి.

అలాగే మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని నేటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నేత కె చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి అవాంఛనీయ, అసాంఘిక సంఘటనలకు తావియ్యకుండా అందరిని ఐక్యం చేసి రాష్ట్రాన్ని సాకారం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శితమౌతున్న గాంధీ సినిమా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అందరిలో సంఘటిత భావాన్ని పెంపోందిస్తుంది. సినిమా విడుదల అయి 40 ఏండ్లు అయినప్పటికీ నేటి సమాజానికి ఆదర్శనీయమైన ఆశయాలను స్ఫురణకు తెస్తున్న చిత్రం గాంధీ.

More Press Releases