కేసీఆర్ గొప్ప సెక్యులర్, తెలంగాణలో శ్రేయోరాజ్యం నడుస్తున్నది: మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ

Related image

  • లోటుపాట్లకు తావులేకుండా మొహర్రంకు పకడ్బంధీ ఏర్పాట్లు చేయండి:అధికారులను ఆదేశించిన మంత్రులు
  • మొహర్రం ఏర్పాట్లకు సంబంధించి ముందస్తు సమావేశం నిర్వహించిన మంత్రులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకిక వాది అని, తెలంగాణ ప్రజలందరిని కంటికి రెప్పలా చూసుకుంటూ సుపరిపాలన అందిస్తున్నారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు అన్నారు. వచ్చే నెల 8, 9 తేదీలలో జరిగే మొహర్రం పండుగ, ఊరేగింపునకు సంబంధించిన ఏర్పాట్లపై ముందస్తు సమావేశం శనివారం మాసబ్ ట్యాంకులోని సంక్షేమ భవన్ లో జరిగింది.

ఈ సందర్భంగా మంత్రులు కొప్పుల,అలీలు మాట్లాడుతూ, మైనారిటీలతో పాటు ప్రజలందరి భద్రత, సంక్షేమం, ఉన్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రధానమైన అన్ని పండుగలు, జాతరలు,ఉత్సవాలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో శ్రేయోరాజ్యం కొనసాగుతున్నదని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవిస్తున్నారని కొప్పుల, అలీలు వివరించారు.

మొహర్రం పండుగ, ఊరేగింపు సందర్భంగా ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బంధీ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. అషూర్ ఖానాలకు అవసరమైన మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ఆ చుట్టుపక్కల చెత్తాచెదారం, గుంతలు లేకుండా చక్కగా తీర్చిదిద్దాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, ట్రాఫిక్ జాంలకు అవకాశం ఇవ్వకుండా, తాగునీటి కొరత రాకుండా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు, సలహాలిచ్చారు.

సంక్షేమ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులతో పాటు మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్,హజ్ కమిటీ ఛైర్మన్ సలీం, WAKF బోర్డు ఛైర్మన్ మసీవుల్లా, ఎమ్మెల్సీ జాఫ్రీ, ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ ఖాన్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, నగర పోలీసు కమిషనర్ ఆనంద్, జాయింట్ కమిషనర్ చౌహాన్, WAKF బోర్డు సిఇవో షానవాజ్ ఖాసీం, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.


తెలంగాణలో మైనారిటీల సంక్షేమం భేషుగ్గా ఉంది: బీహార్ మంత్రి జమా ఖాన్
  • మైనారిటీలలో నెలకొన్న నిరక్షరాస్యత, పేదరికాన్ని పారదోలేందుకు అమలు చేస్తున్న పథకాలు ప్రశంసనీయం: బీహార్ మంత్రి జమా ఖాన్ 
  • ఇక్కడి గురుకులాలు దేశానికే ఆదర్శం,మేం కూడా మీ బాటలోనే నడుస్తం: బీహార్ మంత్రి జమా ఖాన్
మైనారిటీలలో నెలకొన్న నిరక్షరాస్యతను, పేదరికాన్ని పారదోలేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని బీహార్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమా ఖాన్ కితాబునిచ్చారు. ఈ రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఈ ఎనిమిదేళ్ల స్వల్ప కాలంలోనే అన్ని రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించడం అభినందనీయమన్నారు. ఒక వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రెండు రోజుల కిందట వచ్చిన తాను ఇక్కడ జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూశానన్నారు. బంజారాహిల్స్ లోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయాన్ని శనివారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలతో కలిసి జమా ఖాన్ సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రుల సమక్షంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, సొసైటీ కార్యదర్శి షఫీవుల్లాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న పథకాలు,కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం, ఉన్నతికి 9వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. తెలంగాణలో లౌకిక ప్రభుత్వం కొనసాగుతున్నదని,ఇక్కడ అన్ని మతాలు, ప్రాంతాలు,భాషలకు చెందిన వాళ్లు ప్రశాంతంగా జీవిస్తున్నారని.. గంగా-జమున తహజీబ్ కిది నిలువుటద్దమన్నారు. విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే మైనారిటీ యువతకు 20లక్షల చొప్పున ఉచితంగా ఇస్తామని చెప్పారు. పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లకు షాధీ ముభారక్ పథకం కింద లక్షా 16రూపాయలు అందజేస్తుండడంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గి చక్కగా చదువుకుంటున్నారని వివరించారు.

ఇమామ్,మౌజంలు 10వేల మందికి 5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నామని పేర్కొన్నారు. మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా 204 గురుకుల పాఠశాలలు నడుపుతున్నామని.. వీటిలో లక్షా 31వేల మంది బాలబాలికలకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. వీటిలో చదువుతున్న విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని, క్రీడల్లో రాణిస్తున్నారని, అమెరికాలోని నాసా కేంద్రాన్ని కూడా సందర్శించారని తెలిపారు. 

క్రమశిక్షణతో, ఉన్నత ప్రమాణాలు,విలువతో ముందుకు సాగుతున్న ఈ పాఠశాలలను దేశవిదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సందర్శించి ప్రశంసలు గుప్పించారని ఖాన్, షఫీవుల్లాలు వివరించారు. జమాఖాన్ మాట్లాడుతూ, ఇక్కడ విజయవంతంగా అమలవుతున్న పథకాల గురించి తమ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వివరిస్తానన్నారు. రెండు మూడు నెలల తర్వాత తిరిగి ఇక్కడకు వచ్చి, గురుకుల పాఠశాలలను సందర్శిస్తానని,వీటిని ఆదర్శంగా తీసుకుని బీహార్ లో కూడా అమలు చేస్తామన్నారు.

More Press Releases