సీఎం ఆదేశాల మేరకు అత్యుత్తమ టూరిజం పాలసీని రూపొందించాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అత్యుత్తమ టూరిజం పాలసీని రూపొందించటానికి టూరిజం అధికారులు తగిన ప్రతిపాదనలు, ప్రణాళికలను సిద్ధం చేయాలని టూరిజం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతికొద్ది సమయంలోనే రెండు అంతర్జాతీయ స్థాయి అవార్డులను సాధించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు, విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించేందుకు టూరిజం అధికారులు తగిన ప్రణాళికలు, కార్యక్రమాలు నిరంతరం రూపొందించే విధంగా దేశంలోనే అత్యుత్తమ టూరిజం పాలసీని రూపొందించేందుకు టూరిజం అధికారులు అవసరమైన ప్రతిపాదనలు, ప్రణాళికలను రూపొందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.

టూరిజం పాలసీని రూపకల్పనపై టూరిజం అధికారులు వివిధ టూరిజం నేపథ్యంలో ఉన్న దేశాలైన సింగపూర్, మలేసియా, దుబాయ్ లాంటి దేశాల్లో ఉన్న పాలసీలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలైనా గోవా, కేరళ లాంటి రాష్ట్రాల టూరిజం పాలసీలను పరిశీలించి, అధ్యయనం చేసి, తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ టూరిజం పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనపై దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయన్నారు. రాష్ట్రంలో ట్రైబల్, ఎకో, మెడికల్, టెంపుల్, హెరిటేజ్ టూరిజం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లేలా తగిన ప్రచారం నిర్వహించేలా కార్యక్రమాలు పాలసిలో ఉండేలా మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమర్ధ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అన్ని రాష్ట్రాలకు అభివృద్ధిలో రోల్ మెడల్ గా నిలుస్తోందన్నారు. అలాగే పర్యాటక రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా టూరిజం పాలసీ ఉండేలా డ్రాఫ్ట్ పాలసీని సిద్ధం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ టూరిజం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, వైఏటీ&సీ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ కె రమేష్, టూరిజం లీగల్ ఓఎస్డీ సత్యనారాయణ, టూరిజం ఉన్నతాధికారులు శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases