Renuka Chowdhury: జగన్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సెటైర్లు

  • మూడు రాజధానులపై రేణుకా చౌదరి సెటైర్
  • ఏపీకి జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారని వ్యాఖ్య
  • డ్రగ్స్, మర్డర్స్, నిరుద్యోగమే ఈ రాజధానులని చురక
renuka chowdhury satires on YS Jagan government

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి విమర్శలు గుప్పించారు. సోమవారం ఆమె హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాజకీయాలపై మాట్లాడిన అనంతరం ఆమె ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మూడు రాజధానులపై ఆమె సెటైర్ వేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారని వ్యంగ్యంగా అన్నారు. ఈ మూడు రాజధానుల్లో... ఒకటి డ్రగ్స్, రెండు మర్డర్స్, మూడోది నిరుద్యోగం అని ఎద్దేవా చేశారు. ఏపీలో జగన్ ఏర్పాటు చేసింది ఈ మూడింటినే అన్నారు.

  • Loading...

More Telugu News