Jagan Kosam Siddham: మరో 11 రోజుల్లో ఎన్నికలు... వైసీపీ కొత్తగా చేపట్టిన కార్యక్రమం ఇదే!

  • ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం కార్యక్రమాలు తీసుకువచ్చిన వైసీపీ
  • తాజాగా 'జగన్ కోసం సిద్ధం' అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం
  • ప్రతి ఇంటికీ వైసీపీ మేనిఫెస్టోను చేరవేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం
YCP starts new initiative ahead of polls

గడప గడపకు మన ప్రభుత్వం, సిద్ధం, మేమంతా సిద్ధం వంటి కార్యక్రమాలను తీసుకువచ్చిన వైసీపీ... మరో 11 రోజుల్లో ఎన్నికలు రానుండగా కొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం పేరు... 'కలలు నిజం చేయడానికి.... జగన్ కోసం సిద్ధం'. ఇప్పటికే దీనికి సంబంధించిన హోర్డింగ్ లు, పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. 

ఇటీవల సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంటికీ చేరవేయడమే 'జగన్ కోసం సిద్ధం' కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ప్రజలే తమ స్టార్ క్యాంపెయినర్లని ఇటీవల సభల్లో తరచుగా చెబుతున్న సీఎం జగన్... ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కూడా తమ ప్రచార పర్వంలో భాగం చేయనున్నారు.

  • Loading...

More Telugu News