Sri Rama Navami: జంటనగరాల్లో నేడు శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

  • భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవ్య శోభాయాత్ర
  • ధూల్‌పేట సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర
  • రాత్రి 11.30 గంటల వరకు గోషామహల్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
  • 1000 మంది పోలీసులతో భద్రత
Sri Rama Navami Shobha Yatra Today In Twin Cities Today

శ్రీరామ నవమి సందర్భంగా నేడు జంట నగరాల్లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ధూల్‌పేట సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెయ్యిమంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. 

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సూచించిన మార్గంలోనే యాత్ర నిర్వహించాలని హైకోర్టు నిన్న స్పష్టం చేసింది. భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరగనున్న ఈ భవ్య శోభాయాత్ర సందర్భంగా గోషామహల్, సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News